అన్వేషించండి

CM Revanth Reddy: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. కొత్త చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

Telangana Govenrment Employees | మీకు జీతం ఎలా వస్తుందో, మీ తల్లిదండ్రులకు కూడా నెలవారీ ఆదాయం వచ్చేలా చూస్తాం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఈ చట్టంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిబంధనలు ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (అక్టోబర్ 18, 2025) నాడు హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.

ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురానున్నాం. దీని ప్రకారం ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, అతని జీతంలో 10 నుండి 15 శాతం కోత విధిస్తాం. ఆ నగదు మొత్తాన్ని నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులకు చెల్లించాలని నిబంధన తీసుకొస్తామన్నారు. 


CM Revanth Reddy: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. కొత్త చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

కొత్తగా ఎంపికైన గ్రూప్ 2 ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత 

 గ్రూప్-2 పోస్టులకు కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. సమస్యలతో తమ వద్దకు వచ్చే వారి పట్ల సున్నితంగా ఉండాలని సూచించారు. 'మేము ఒక చట్టాన్ని తీసుకువస్తున్నాం. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కనుక వారి జీతంలో 10 నుండి 15 శాతం కోత విధించి, ఆ నగదును వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. మీరు ఈ చట్టాన్ని పాటించాలి. మీకు ఎలా నెలవారీ జీతం అందుతుందో, మీ తల్లిదండ్రులకు కూడా నెలవారీ ఆదాయం అందేలా ప్రభుత్వం చేస్తుందని' అన్నారు. 


CM Revanth Reddy: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. కొత్త చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

 కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్‌కు ఆదేశం

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని రూపొందించడానికి సంబంధిత అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కానీ పదిహేనేళ్లుగా తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటయ్యాక పదేళ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్ట్ కూడా బీఆర్ఎస్ సర్కార్ భర్తీ చేయలేదని, తాము ఒకే ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల కిందటే ఉద్యోగాలు వచ్చేవి. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కోసం పనిచేయాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. 

సెంటిమెంట్ రగిల్చి అధికారం కోసం ప్రయత్నాలు

గత పాలకుల పాపాల పుట్ట నేడు పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు.. వారి కుటుంబ సభ్యులే ప్రజలకు చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే బీఆర్ఎస్ వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అలాంటి వారి ప్రచారాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. సమర్ధవంతంగా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుక్రవారం నాడు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. రెడ్డి ప్రభుత్వం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అంగీకరించింది. దీనితో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ, వ్యవసాయ కళాశాలలతో ముఖ్యమైన పథకాలకు కూడా ఆమోదం తెలిపింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Lokesh Kanagaraj and Allu Arjun: అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Lokesh Kanagaraj and Allu Arjun: అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Embed widget