అన్వేషించండి

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. దాదాపు 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడతారు. పూర్తి షెడ్యూల్ గురించి తెలుసుకోండి 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణకు చేరుకున్న ప్రధాని మోదీ, పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
  • సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మల్లాపూర్, కాజీపేటలలో కీలక పనులకు శంకుస్థాపన చేశారు.
  • వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్, సింధూ ఆసుపత్రిని ప్రారంభించారు.
  • బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, గుజరాత్‌కు తిరుగు ప్రయాణం.

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ వస్తున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.  ఈ పర్యటన రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి   కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రధాని రాకకు పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రాధాన్యత కలిగింది. సుమారు 8వేల కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజలకు అందించే లక్ష్యంతో సాగుతుంది. 

ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం ఉంది. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద 2,360 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ స్మార్ట్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇది పారిశ్రామిక రంగంలో తెలంగాణకు కొత్త దిశకు చూపించనుంది. 3175 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడెబెల్లూరు మహాబూబ్‌నగర్ జాతీయ రహదారి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.  611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1243 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులకు ప్రధాని జాతీకి అంకితం చేస్తారు.వరంగల్ జిల్లలో 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ టెక్స్ టైల్ పార్క్ తెలంగాణ చేనేత, వస్త్ర రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి సహయపడుతుంది. 

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదే 

ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం తెలంగాణకు చేరుకోనున్నారు. ఆయన పర్యటన అత్యంత పకడ్బందీగా సాగేలా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. మధ్యాహ్నం 2.50 గంటలకు కర్ణాటక నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. హెలీకాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకొని అక్కడ 8000కోట్ల విలువై వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.10 నిమిషాలకు హైటెక్ సిటీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన సింధూ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లో జామ్‌నగర్‌కు బయల్దేరారు. 

ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.    

Frequently Asked Questions

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఎందుకు చేస్తున్నారు?

ప్రధాని మోడీ తెలంగాణలో రూ. 8వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్నారు. ఈ పర్యటన రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో ఉంది.

ప్రధాని మోడీ ఈ పర్యటనలో ఏ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు?

ప్రధాని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద స్మార్ట్ సిటీ, గూడెబెల్లూరు-మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారి, మల్లాపూర్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని మోడీ ఏ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు?

ప్రధాని మోడీ కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులను జాతీకి అంకితం చేస్తారు. అలాగే, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు, హైటెక్‌సిటీ ప్రాంతంలో సింధూ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఏమిటి?

ప్రధాని ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొని, అనంతరం గుజరాత్‌కు బయల్దేరుతారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad Traffic Diversions: నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
Embed widget