అన్వేషించండి

Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!

ప్రధాని మోదీ పర్యటన కోసం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఐఎస్‌బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైన వేళ అందుకోసం భద్రతా పరంగా చాలా సూక్ష్మమైన కసరత్తు సాగుతోంది. ఈ నెల 26న గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ - Indian School of Business) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం భారీగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తికి ఈ ఏర్పాట్లు సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు  మాత్రం సోషల్ మీడియాలో కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడ పడుతున్నారు.

ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన కోసం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఐఎస్‌బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరిలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉండనున్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా ఖాతాలను కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడపడుతున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏవైనా పోస్టులు పెట్టారా? అని వాళ్ల అకౌంట్లను చెక్ చేస్తున్నారు. అంతేకాక, విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఎస్పీజీ అధికారులు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాల్లో బాగుంటేనే ఆయా విద్యార్థులకు ఎంట్రీ పాసులు ఇవ్వాలని చూస్తున్నారు. ఎవరైనా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటే వారికి అనుమతించరు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాదించిన 8 మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందించనున్నట్లు ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు.

ఐదేళ్లకోసారి ఘనంగా స్నాతకోత్సవం, ప్రత్యేక అతిథి కూడా
ఐఎస్‌బీ గతంలో 5వ వార్షికోత్సవానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, 10వ వార్షికోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ప్రతిభ పాటిల్, 15వ వార్షికోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు మే 26న జరిగేది  20వ వార్షికోత్సవం. దీనికి ప్రధాని మోదీ విచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడనున్నారు. 

సీఎం కేసీఆర్ దూరం
ఈ 20వ వార్షికోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించామని ఐఎస్‌బీ డీన్ మదన్ తెలిపారు. అయితే, కేసీఆర్ ప్రధాని పర్యటనకు హాజరు కావడం లేదు. ఇలా సీఎం ప్రధాని కార్యక్రమానికి హాజరు కాకపోవడం వరుసగా ఇది మూడోసారి. 2020లో ప్రధాని భారత్ బయోటెక్‌ సందర్శనకు వచ్చినప్పుడు కేసీఆర్ పర్యటనకు రావొద్దని పీఎంవోనే వెల్లడించింది. గత ఫిబ్రవరి 5న కూడా మోదీ హైదరాబాద్ వచ్చారు. ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు కూడా కేసీఆర్ అందులో పాల్గొనలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Raj Tarun Comments: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
MP Kalishetti Appalanaidu : ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
ఆస్తుల్లో పేదవాడే కానీ ఆశయంలో ఉన్నతుడే - అమరావతికి తొలి జీతం విరాళం ఇచ్చేసిన టీడీపీ ఎంపీ
Ramya Krishnan: రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
రాజమాత ఏంటిది? రమ్యకృష్ణ బోల్డ్ ఫొటోలు వైరల్ - ఇది కూడా AI మాయేనా? దారుణం!
Embed widget