By: ABP Desam | Updated at : 07 Jun 2023 10:38 PM (IST)
కేసీఆర్ తో సర్పంచ్ లు
మహారాష్ట్రకు చెందిన 50 మంది సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దేశ ప్రజలకు తాగు, సాగునీరు, విద్యుత్తు నేటికీ సరిగా అందట్లేదని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలాగా ఇతర రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదని ప్రశ్నించారు. చుక్కల్లో చంద్రుడ్ని తెచ్చి ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ నేతలను తాము అడుగుతున్నామా అని ప్రశ్నించారు. తాగు, సాగు నీరు, విద్యుత్ ఇస్తే చాలని అడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మధ్యప్రదేశ్ కి చెందిన నేత కూడా
ప్రముఖ సామాజిక కార్యకర, వ్యాపమ్ స్కామ్ను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఆనంద్ రాయ్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త ఆనంద్రాయ్ ఆర్టీసీ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Vandebharat Train: ఏపీ, తెలంగాణలో నేడు 2 కొత్త వందేభారత్లు - వీటి ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు
Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
KNRUHS: ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
/body>