అన్వేషించండి

Hyderabad It Raids: హైదరాబాద్ బిర్యానీ కింగ్‌లపై ఐటీ దాడులు - మూడు ప్రధాన బ్రాండ్ల హోటళ్లలో సోదాలు - భారీగా ట్యాక్స్ ఎగవేత?

Hyderabad: హైదరాబాద్‌లో బిర్యానీ కింగ్‌లుగా ప్రసిద్ధి చెందిన షాగౌస్, పిస్తాహౌస్, మెహఫిల్ రెస్టారెంట్ చైన్స్ పై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు.

Hyderabad  major biryani chains IT sleuths raid:   నగరంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మూడు బిర్యానీ రెస్టారెంట్ లపై ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగం మంగళవారం ఉదయం నుంచి విస్తృత సోదాలు చేపట్టింది. పిస్టా హౌస్, షా గౌస్, మెహ్ఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌లకు చెందిన కార్యాలయాలు, బ్రాంచ్‌లు, యజమానుల నివాసాలతో సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.

అనేక కోట్ల రూపాయల విలువైన అమ్మకాలను దాచిపెట్టి పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి.  ప్రాథమిక సమాచారం లభించడంతో ఈ సోదాలు  చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ఆర్డర్లు, ఫ్రాంచైజీ వ్యాపారం, హలీమ్ సీజన్‌లో భారీ టర్నోవర్‌లను సరిగ్గా రికార్డు చేయకపోవడం, నగదు లావాదేవీలను దాచిపెట్టడం వంటి అంశాలపైనే దర్యాప్తు కేంద్రీకరించారు.  
 
పిస్టా హౌస్ షా అలీ బండాలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన సోదాలు రంగారెడ్డి జిల్లాలోని బ్రాంచ్‌ల్లోనూ నిర్వహిస్తున్నారు.   1997లో మొహమ్మద్ అబ్దుల్ మజీద్ స్థాపించిన ఈ బ్రాండ్ ఇప్పుడు భారత్‌తో పాటు అమెరికా, దుబాయ్, ఒమన్, కువైట్‌లలో మొత్తం 44 ఔట్‌లెట్లను నడుపుతోంది. సల్మాన్ ఖాన్ నుంచి రాజకీయ నాయకుల వరకు సెలబ్రిటీలకు పిస్తాహౌస్ బిర్యానీ ఇష్టం.  గత కొన్నేళ్లుగా రంజాన్ హలీమ్ సీజన్‌లోనే అనేక కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుందని అంచనా.

అలాగే గచ్చిబౌలి నుంచి ఓల్డ్ సిటీ వరకు విస్తరించి ఉన్న షా  గౌస్ బ్రాంచ్‌లు, కార్యాలయాలు,  యాప్‌లతో జరిపే వ్యాపారంపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. 2006లో ప్రారంభమైన మెహ్ఫిల్ గ్రూప్ ఇప్పటికే హైదరాబాద్‌లో 15 బ్రాంచ్‌లతో పాటు దుబాయ్‌లోనూ ఔట్‌లెట్‌ను నడుపుతోంది. 2025లోనూ కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించారు.  ఈ మూడు బిర్యానీ కింగ్ ల యజమానులు పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  మూడు గొలుసుల యజమానులు, ఆర్థిక నిర్వాహకుల నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతుండటంతో నగర వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. సోదాలు పూర్తయ్యాక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.   

ఈ మూడు  సంస్థల బిజినెస్ మోడల్ వేరుగా ఉంటుంది. ఎక్కువగా నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తారు.  నగదుతో చెల్లిస్తే ఓ ధర ఉంటుంది.. ఆన్ లైన్ పేమెంట్ అయితే మరో ధర ఉంటుంది. మెహఫిల్ రెస్టారెంట్లలో అయితే చాలా చోట్ల నగదు లావాదేవీలు మాత్రమే జరుగుతాయి.  అయితే వీరి వ్యాపారం మాత్రం ఊహించనంత బిజీగా ఉంటుంది.  ఎప్పుడు చూసినా సీట్లు ఖాళీ ఉండవు.  రంజాన్ మాసంలో అయితే వీరి హోటళ్ల వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. ఎక్కువ ధర పెట్టినా హలీంను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు.  కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేస్తున్నా వీరు చాలా స్వల్పమొత్తంలోనే పన్నులు చెల్లిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో సోదాలు చేస్తున్నారు. ఎంత మేర పన్ను ఎగవేతలు బయటపడతాయో చూడాల్సి ఉంది.                              

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget