అన్వేషించండి

Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వానికి కుల గణన సర్వేపై నివేదికను సమర్పించిన నిపుణుల కమిటీ, నెక్ట్స్ ఏంటి

Telangana News | కుల గణన సర్వే నివేదికపై నియమించిన ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి 300 పేజీలతో కూడిన రిపోర్ట్ ఇచ్చింది.

 Independent Expert Working Group | హైదరాబాద్: దేశంలో కుల గణన చేపట్టిన తొలి ప్రభుత్వం తమదే అని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కుల‌గ‌ణ‌నపై అధ్య‌య‌నం చేయ‌డానికి ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ తెలంగాణ ప్రభుత్వానికి 300 పేజీల నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు శనివారం నాడు (జులై 19న) సమావేశమయ్యారు. వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐలయ్య, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రవీణ్ చక్రవర్తి, ప్రొఫెసర్ హిమాన్షు, నిఖిల్ డే, డా. సుఖదేవ్ తొరాట్, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్లు పురుషోత్తం రెడ్డి, జీన్ డ్రెజ్, థామస్ పికెట్టి, సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి  ఈ సందర్భంగా తమ నివేదికను అందించారు. 

ఈ కులగణన సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలతో పాటు వారి సూచనలను కేబినెట్ భేటీలో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను కొన్ని నెలల కిందట నిర్వహించింది.


Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వానికి కుల గణన సర్వేపై నివేదికను సమర్పించిన నిపుణుల కమిటీ, నెక్ట్స్ ఏంటి

50 రోజుల పాటు తెలంగాణలో సర్వే

మొదటి విడతలో భాగంగా 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు దాదాపు 50 రోజుల పాటు తెలంగాణలో సర్వే నిర్వహించింది.  రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్ గా చేసింది. ఒక్కో బ్లాక్ కు ఒక ఎన్యుమరేటర్, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో ప్రభుత్వం శాస్త్రీయంగా సర్వే చేయించింది. మొదటి విడతలో రాష్ట్రంలో96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటా ఎంట్రీ సైతం చేశారు.

తెలంగాణలో సామాజిక వర్గాల వారిగా లెక్కలు
మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవటంతో ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు రెండో విడతలో అవకాశం కల్పించింది. మీ సేవా కేంద్రాలు, ఎంపీడీవో ఆఫీసులు, జీహెచ్ఎంసీ, వెబ్‌సైట్ ద్వారా వారి వివరాలను ఎంట్రీ చేయించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10 శాతం) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42 శాతం), ఎస్టీలు 37,08,408 మంది (10.43 శాతం), బీసీలు 2,00,37,668 మంది (56.36 శాతం), ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 మంది అంటే 15.89 శాతం మంది ఉన్నారు.

కొంతకాలం కిందట ప్రభుత్వం కుల గణన సర్వే చేసింది. సర్వే వివరాల నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగారాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్రెడ్డి గారి  అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర్య నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. కుల గణన సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. 

వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ కుల గణన సర్వే  డేటాను సేకరించిన పద్దతి సరిగ్గా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, వెనుకబడిన బలహీనవర్గాల వర్గాలకు మేలు చేయడానికి కుల గణన నివేదిక సహాయపడుతుందని నిపుణుల కమిటీ సూచించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో నేటి నుంచి 2 రోజులపాటు చేప ప్రసాదం పంపిణీ.. 
హైదరాబాద్‌లో నేటి నుంచి 2 రోజులపాటు చేప ప్రసాదం పంపిణీ.. 
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad Traffic Diversions: నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Embed widget