అన్వేషించండి

Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వానికి కుల గణన సర్వేపై నివేదికను సమర్పించిన నిపుణుల కమిటీ, నెక్ట్స్ ఏంటి

Telangana News | కుల గణన సర్వే నివేదికపై నియమించిన ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి 300 పేజీలతో కూడిన రిపోర్ట్ ఇచ్చింది.

 Independent Expert Working Group | హైదరాబాద్: దేశంలో కుల గణన చేపట్టిన తొలి ప్రభుత్వం తమదే అని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కుల‌గ‌ణ‌నపై అధ్య‌య‌నం చేయ‌డానికి ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ తెలంగాణ ప్రభుత్వానికి 300 పేజీల నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు శనివారం నాడు (జులై 19న) సమావేశమయ్యారు. వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐలయ్య, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రవీణ్ చక్రవర్తి, ప్రొఫెసర్ హిమాన్షు, నిఖిల్ డే, డా. సుఖదేవ్ తొరాట్, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్లు పురుషోత్తం రెడ్డి, జీన్ డ్రెజ్, థామస్ పికెట్టి, సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి  ఈ సందర్భంగా తమ నివేదికను అందించారు. 

ఈ కులగణన సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలతో పాటు వారి సూచనలను కేబినెట్ భేటీలో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను కొన్ని నెలల కిందట నిర్వహించింది.


Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వానికి కుల గణన సర్వేపై నివేదికను సమర్పించిన నిపుణుల కమిటీ, నెక్ట్స్ ఏంటి

50 రోజుల పాటు తెలంగాణలో సర్వే

మొదటి విడతలో భాగంగా 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు దాదాపు 50 రోజుల పాటు తెలంగాణలో సర్వే నిర్వహించింది.  రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్ గా చేసింది. ఒక్కో బ్లాక్ కు ఒక ఎన్యుమరేటర్, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో ప్రభుత్వం శాస్త్రీయంగా సర్వే చేయించింది. మొదటి విడతలో రాష్ట్రంలో96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటా ఎంట్రీ సైతం చేశారు.

తెలంగాణలో సామాజిక వర్గాల వారిగా లెక్కలు
మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవటంతో ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు రెండో విడతలో అవకాశం కల్పించింది. మీ సేవా కేంద్రాలు, ఎంపీడీవో ఆఫీసులు, జీహెచ్ఎంసీ, వెబ్‌సైట్ ద్వారా వారి వివరాలను ఎంట్రీ చేయించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10 శాతం) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42 శాతం), ఎస్టీలు 37,08,408 మంది (10.43 శాతం), బీసీలు 2,00,37,668 మంది (56.36 శాతం), ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 మంది అంటే 15.89 శాతం మంది ఉన్నారు.

కొంతకాలం కిందట ప్రభుత్వం కుల గణన సర్వే చేసింది. సర్వే వివరాల నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగారాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్రెడ్డి గారి  అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర్య నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. కుల గణన సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. 

వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ కుల గణన సర్వే  డేటాను సేకరించిన పద్దతి సరిగ్గా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, వెనుకబడిన బలహీనవర్గాల వర్గాలకు మేలు చేయడానికి కుల గణన నివేదిక సహాయపడుతుందని నిపుణుల కమిటీ సూచించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
10K Steps Daily : రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Embed widget