అన్వేషించండి

Kazipet Rail Coach Factory: 2026లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Kazipet Rail Manufacturing Unit | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ యూనిట్‌లో 2026లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Kazipet Rail Coach Factory కాజీపేట: 2026 నుంచే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో మానుఫ్యాక్చరింగ్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్ (బ), కిషన్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర టూరిజం, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రైల్లో వచ్చిన కాజీపేటకు చేరుకున్న మంత్రులు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ పనులు జరుగుతున్న తీరుపై మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన గ్యారంటీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. 

కొత్త టెక్నాలజీతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Rail Manufacturing Unit)
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతోంది. రైల్వే కోచ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ దాదాపు 40 సంవత్సరాల ప్రజల కల. ఆ కలను సాకారం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుంది. 500 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ పరిశ్రమ ఏర్పాటు జరుగుతోందని, 2026 నాటికి ఈ యూనిట్‌లో మానుఫ్యాక్చరింగ్  ప్రారంభమవుతుంది. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకొని, ఇక్కడ రైల్వే కోచ్‌లు, ఇంజిన్లతో పాటు మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా జరుగుతాయి. పలు రకాల రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించనున్నాం. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉందని’ పేర్కొన్నారు.


Kazipet Rail Coach Factory: 2026లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

వరంగల్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేది ఇక్కడి ప్రజల డిమాండ్, ఆకాంక్ష. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయి. 

మూడు వేల మందికి ఉపాధి
నరేంద్ర మోదీ  ప్రధాని అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని, మంజూరు చేశారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అలాగే పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోంది. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమే. వరంగల్‌లో రింగ్‌ రోడ్‌లో 50 శాతం పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిందనీ, టెక్స్‌టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసింది కేంద్రప్రభుత్వం. వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించాం. 


Kazipet Rail Coach Factory: 2026లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ముఖ్యంగా వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అవసరం ఎంతో ఉందని నేను గత బీఆర్ఎస్ పాలన సమయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగిస్తే, వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు.. బిజెపి ఏం తెచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు కళ్లు, చెవులుంటే మోదీ  చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూసి తెలుసుకోవాలని’ కిషన్ రెడ్డి అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget