News
News
వీడియోలు ఆటలు
X

Hyderabad News: పెళ్లైన యువకుడి వేధింపులు, వివాహం క్యాన్సిల్ అవడంతో యువతి ఆత్మహత్య

Hyderabad News: పెళ్లైన వ్యక్తి వేధింపులు, జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ కావడంతో రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

FOLLOW US: 
Share:

Hyderabad News: ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు రోజూ ఎక్కడో ఒక దగ్గర వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇష్టం లేదని అమ్మాయిలు చెప్పినా మృగాళ్ల రూపంలోని మగాళ్లు వినిపించుకోవడం లేదు. తాజాగా అలాంటి వేధింపులు ఓ యువతి ప్రాణాలు తీశాయి. పెళ్లి బంధంతో కొత్త ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఆ యువతి.. చివరికి ప్రాణాలు బలితీసుకుంది. పెళ్లైన ఓ యువకుడి వేధించడం, ఖాయమైన పెళ్లిని చెడగొట్టడంతో తీవ్రంగా మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ యువకుడి దుశ్చర్యతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

అసలేం జరిగిందంటే..?

ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో చోటు చేసుకుంది. బైరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుమార్తె అనూష (22) డిగ్రీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. ఆమె తల్లి చాలా కాలం క్రితమే చనిపోయింది. ఈ యువతికి ఇటీవలె ఓ కానిస్టేబుల్ తో నిశ్చితార్థం జరిగింది. బైరంపల్లి గ్రామానికే చెందిన శ్రీకాంత్ అనుషూతో నిశ్చితార్థం చేసుకున్న కానిస్టేబుల్ కు ఫోన్ చేసి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీయడంతో అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. శ్రీకాంత్ కు ఇప్పటికే పెళ్లి జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన యువతి శుక్రవారం రాత్రి గదిలో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు తెల్లవారి చూసే సరికి చనిపోయి కనిపించింది. మృతురాలి సోదరుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కోన వెంకటేశ్వరలు తెలిపారు.

రెండ్రోజుల క్రితం నిశ్చితార్థం రద్దవుతుందన్న భయంతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

నిశ్చితార్థం రద్దవుతుందేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. గతంలోనే ఓ సారి పెళ్లి నిశ్చయం అయి నిశ్చితార్థం అయ్యాక క్యాన్సిల్ అయింది. ఏడాది తర్వాత మళ్లీ పెళ్లి కుదిరింది. అయితే వరసకు అతడు.. సదరు మహిళకు కొడుకు అవుతాడని కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం విని.. ఈ నిశ్చితార్థం కూడా ఎక్కడ క్యాన్సిల్ అవుతోందనని భయపడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. 

రంగారెడ్డి జిల్లా కందుకూరు జైతారం గ్రామానికి చెందిన 28 ఏళ్ల సురేఖ 2018 బ్యాచ్ కానిస్టేబుల్. అయితే ఈమె ప్రస్తుతం తన సోదరితో కలిసి అలియాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.హైదరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో పని చేస్తుంది. అయితే సురేఖకు ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి రద్దు అయింది. అయితే ఏడాది తర్వాత అంటే ఈనెల 1వ తేదీన స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో పెళ్లి కుదిరింది. అయితే ఆ యువకుడు సురేఖకు వరుసకు కొడుకు అవుతాడట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు చర్చించుకుంటుండగా సురేఖ విన్నది. ఈ క్రమంలోనే గతంలో లాగానే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందేమోనని భయపడింది. తన పరువు పోతుందని భావించి ప్రాణాలు తీసుకోవడం మేలనుకుంది. అనుకున్నదే తడువుగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

Published at : 08 May 2023 07:21 AM (IST) Tags: Hyderabad News Woman suicide Latest Crime News Telangana News Hyderabad Suicide Case

సంబంధిత కథనాలు

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్