అన్వేషించండి

MLA Raja Singh: బీఆర్ఎస్ నేతల సొంతానికి జీహెచ్ఎంసీ నిధులు - ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపణలు

కేసీఆర్ సర్కార్ పై ఎమ్మెల్యే రాజసింగ్ పలు ఆరోపణలు చేశారు.

జీహెచ్ఎంసీ నిధులను బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకుంటున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యే రాజసింగ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 

బీఆర్ఎస్ సర్కారు రాజకీయాలను అవినీతి మయం చేసిందని రాజసింగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలన తెలంగాణను అప్పుల పాలు చేశాయని ధ్వజమెత్తారు. 

 మున్సిపల్ కాంట్రాక్టర్లకు(Municipal Contractors) వెంటనే బిల్లులు  చెల్లించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్  ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ (GHMC) నిధులను బీఆర్ఎస్ నేతలు  సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ నిధులను కేసీఆర్ సర్కార్  ఎన్నికల‌‌ కోసం వాడుకోవాలని ప్లాన్ చేసిందని ఆరోపించారు.

జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు చేయకుండా ఎన్నికలకు వెళ్ళితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరమికొడతారన్నారు. ధనిక‌ రాష్ట్రమని పదే పదే చెప్పే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించటం‌ లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవటం వలన నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని రాజాసింగ్ పేర్కొన్నారు.

కార్పొరేషన్ కు సంబంధించిన అత్యవసర పనులకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు చెల్లింపులు జరగలేదని చెప్పారు. పలుసార్లు అధికారులతో నగర మేయర్ తో చర్చించినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని కాలయాపన చేస్తున్నారని రజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు విడుదల చేకపోతే కార్యాలయం ముందు వినూత్న నిరసన చేపడతామని చెప్పరు.

  అక్కడే  వంట వర్పు కూడా ఏర్పాటు చేసి నిరసనను తెలుపుతా మని చెప్పారు. వెంటనే చర్యలు తీసుకొని బిల్లులు చెల్లించని ఎడల ఆందోళనలు తీవ్ర రూపం చేస్తామని వివిధ విభాగాల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా ఇదివరకు తమ నిరసన తెలిపారని రాజాసింగ్ చెప్పారు. పనులు నిలిపివేసి నిరసన తెలియజేయాల్సి వస్తుందని హెచ్చరించారు. 

సీఎం కేసీఆర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఆస్పత్రిలో చేర్పించకుండా ఫామ్ హౌస్ లో ఉంచడం ఏమిటని రాజాసింగ్ ప్రశ్నించారు. సీఎం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్ర మంత్రులు సుడిగాలి పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికి వారే సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దొంగ నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు వెల్లడించిన అందులో అభ్యర్థులకు న్యాయం జరగలేదని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారని ఎమ్మెల్యే రాజాసింగ్ జోష్యం చెప్పారు. తెలంగాణలో కుటుంబ పార్టీ ఫార్ములా ఒక్కటేనని అది అందిన కాడికి దోచుకోవడమే ఫార్ములాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన వల్ల ప్రజలు అలసిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసంతో లేరని చెప్పారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో వైఫల్యాలు తప్ప అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఆరోపించారు. ప్రజల ఆశలకు ఆశలకు అనుగుణంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
Hyderabad Crime News:మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget