అన్వేషించండి

Flyover at KBR park In Hyderabad: కేబీఆర్‌ పార్క్ వద్ద ఫ్లై ఓవర్, అండర్ పాస్.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.1000 కోట్లు ఖర్చు

Hyderabad Traffic Issue | హైదరాబాద్ లో అధిక రద్దీ ఉండే ఏరియాలలో కేబీఆర్ పార్క్ జంక్షన్ ఒకటి. అక్కడ ఓ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Underpass at kbr park in hyderabad | హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. నగరం నడిబొడ్డున రద్దీ అధికంగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక ట్రాఫిక్ ఉండే కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ (KBR Park Flyover) నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ పనులతో ఎకో సెన్సిటివ్ జోన్ దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కి వస్తున్నాయి. దాంతో కొత్త డిజైన్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ నియంత్రించేందుకు కొత్త డిజైన్లతో పనులు చేపట్టాలని జిహెచ్ఎంసి భావిస్తోంది. ఏర్పాటుచెట్టు పలు ఆస్తులు సేకరించాల్సి ఉండగా, భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. 

ప్రాజెక్టు డిజైన్లు మార్చి సమస్యకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్య తీర్చడానికి కేటీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ లను రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద చేపట్టాలని భావించింది. కానీ ఆ పనుల ద్వారా కేబీఆర్ పార్క్ స్థలంలో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పలు కేసులు నమోదు కావడంతో పనులు మొదలుకాలేదు. ఆ సమస్యను గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేబీఆర్ పార్కు వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టు డిజైన్లను కాస్త మార్చింది. ఎకో జోన్ కు దూరంగా ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గంలోనే కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మించాలని భావిస్తోంది. ఇక్కడ తొలగించే చెట్లను మరోచోట ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం కనుక సాధ్యమైనంత త్వరగా కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు పూర్తి చేస్తే ఈ మార్గంలో వెళ్లే నగర వాసులకు ట్రాఫిక్ సమస్య తీరనుంది. ప్రతిరోజూ ఉదయం ఆఫీసులకు, పనులకు బయలుదేరే వారు రోడ్లపై వాహనాలు కదలక ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇదివరకే పలు ఏరియాలలో ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతున్న ప్రభుత్వం తాజాగా కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యపై ఫోకస్ చేసింది.  

ఎలివేటెడ్ కారిడార్‌తో ఏఓసీ రోడ్ల సమస్యకు చెక్
మరోవైపు రక్షణశాఖ అధికారులు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ రోడ్లను తరచూ మూసేస్తుంటారు. అక్కడ సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 6 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు చీఫ్ ఇంజనీర్ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తయితే ఆ ఆర్మీ పరిధిలోని ఏఓసీ రోడ్లతో పనిలేకుండానే ప్రయాణికులు మల్కాజిగిరి- సికింద్రాబాద్‌ ప్రాంతాల మధ్య రాకపోకలు చేసే వీలుంటుందన్నారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget