అన్వేషించండి

KTR: రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR Comments: కేటీఆర్ చిట్ చాట్‌లో ఆసక్తికరమైన అంశాలను మాట్లాడారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయని అన్నారు. అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు.

Telangana News: రుణమాఫీ పైన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తామని.. గ్రామస్థాయిలో కూడా రుణమాఫీపై పోరాట కార్యక్రమాలను చేపడతామని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందనుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైందని అన్నారు. విలేకరులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.

‘‘ఆరు గ్యారంటీల అమలు పైన కూడా బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ పేరు చెప్పి రైతులను మోసం చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పింది నిజం. రైతుల ఖాతాలకు రూ. 7500 కోట్లు మాత్రమే చేరినయ్. అమలు అమలు చేయలేని చేతగానితనంతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు ఇరుక్కపోతున్నారు. రుణమాఫీ పేరుతో ఎన్నో మీటింగ్ లు పెట్టి ఇన్ని నెలల తమాషా తర్వాత రైతుబంధు రెండు విడతల్లో రూ. 7500 కోట్లు మాత్రమే ఇచ్చారు. 

రాష్ట్రం అప్పుల పైన రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తోంది. జీతభత్యాలు లాంటి కచ్చితమైన ఖర్చులు పోను రాష్ట్రం రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్ గా ఉంది. 2014 లో 300 కోట్లు రెవెన్యూ సర్ ప్లేస్ ఉంటే 2023 లో రూ. 5900 కోట్లు సర్ ప్లేస్ గా వారికి ఇచ్చాం. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేవలం ప్రజా అంశాల నుంచి దృష్టి మరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నాడు. రైతు రుణమాఫీ పైన అబద్దాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆగస్టు 15లోగా ఎలాగు రుణమాఫీ చేయలేదు.  కనీసం ఎప్పటిలోగా చేస్తారో అదైనా ముఖ్యమంత్రి చెప్పాలి. రైతు భరోసాను ఎప్పటిలోగా రైతుల ఖాతాలో వేస్తారో కూడా చెప్పాలి. 

రాహుల్ గాంధీకి, రేవంత్‌కు విభేదాలు
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రాహుల్ గాంధీకి  రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల పాటు మా మెడ మీద కత్తిపెట్టినా సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియ్యలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారు. 12,400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలి. 

తెలంగాణ తల్లి అంటే తెలంగాణ జాతికి సంబంధించిన అస్తిత్వానికి ప్రతీక. అద్భుతంగా కట్టుకున్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాహుల్ గాంధీ అయ్య విగ్రహం పెట్టి రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి  ప్రయత్నం చేస్తున్నాడని నేను కూడా అనవచ్చు. రేవంత్ రెడ్డి తన పార్టీ నాయకుల దగ్గర మార్కులు వేయించుకోవడానికి తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏమిటి? అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం అంజయ్య పార్క్ ముందు పెట్టడంలో అంతర్యం ఏమిటి? గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది.

మీ 8 మంది ఎంపీలు గాడిదలు కాస్తారా?
కాంగ్రెస్ నాయకులు ఇదే అహంకారంతో మాట్లాడితే....మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి పథకం పేరును కచ్చితంగా మారుస్తాం. 9 నెలలలో రేవంత్ రెడ్డి సాధించిన గొప్ప విజయం ఢిల్లీకి 20 సార్లు పోయిరావడం. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఇతర ప్రాంత వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీని పంపారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని పదవులను తెలంగాణేతరులకు అప్పజెప్పుతుంది. అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని ముఖ్యమంత్రి అంటే మరి తెలంగాణ నుంచి ఎంపికైనా ఎనిమిది మంది ఎంపీలు గాడిదలు కాస్తారా? మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి మోసం చేసి అభిషేక్ మను సింఘ్వీ కి ఇచ్చారు’’ అని కేటీఆర్ అన్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget