అన్వేషించండి

KTR: రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR Comments: కేటీఆర్ చిట్ చాట్‌లో ఆసక్తికరమైన అంశాలను మాట్లాడారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయని అన్నారు. అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు.

Telangana News: రుణమాఫీ పైన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తామని.. గ్రామస్థాయిలో కూడా రుణమాఫీపై పోరాట కార్యక్రమాలను చేపడతామని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందనుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైందని అన్నారు. విలేకరులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.

‘‘ఆరు గ్యారంటీల అమలు పైన కూడా బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ పేరు చెప్పి రైతులను మోసం చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పింది నిజం. రైతుల ఖాతాలకు రూ. 7500 కోట్లు మాత్రమే చేరినయ్. అమలు అమలు చేయలేని చేతగానితనంతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు ఇరుక్కపోతున్నారు. రుణమాఫీ పేరుతో ఎన్నో మీటింగ్ లు పెట్టి ఇన్ని నెలల తమాషా తర్వాత రైతుబంధు రెండు విడతల్లో రూ. 7500 కోట్లు మాత్రమే ఇచ్చారు. 

రాష్ట్రం అప్పుల పైన రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తోంది. జీతభత్యాలు లాంటి కచ్చితమైన ఖర్చులు పోను రాష్ట్రం రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్ గా ఉంది. 2014 లో 300 కోట్లు రెవెన్యూ సర్ ప్లేస్ ఉంటే 2023 లో రూ. 5900 కోట్లు సర్ ప్లేస్ గా వారికి ఇచ్చాం. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేవలం ప్రజా అంశాల నుంచి దృష్టి మరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నాడు. రైతు రుణమాఫీ పైన అబద్దాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆగస్టు 15లోగా ఎలాగు రుణమాఫీ చేయలేదు.  కనీసం ఎప్పటిలోగా చేస్తారో అదైనా ముఖ్యమంత్రి చెప్పాలి. రైతు భరోసాను ఎప్పటిలోగా రైతుల ఖాతాలో వేస్తారో కూడా చెప్పాలి. 

రాహుల్ గాంధీకి, రేవంత్‌కు విభేదాలు
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రాహుల్ గాంధీకి  రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల పాటు మా మెడ మీద కత్తిపెట్టినా సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియ్యలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారు. 12,400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలి. 

తెలంగాణ తల్లి అంటే తెలంగాణ జాతికి సంబంధించిన అస్తిత్వానికి ప్రతీక. అద్భుతంగా కట్టుకున్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాహుల్ గాంధీ అయ్య విగ్రహం పెట్టి రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి  ప్రయత్నం చేస్తున్నాడని నేను కూడా అనవచ్చు. రేవంత్ రెడ్డి తన పార్టీ నాయకుల దగ్గర మార్కులు వేయించుకోవడానికి తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏమిటి? అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం అంజయ్య పార్క్ ముందు పెట్టడంలో అంతర్యం ఏమిటి? గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది.

మీ 8 మంది ఎంపీలు గాడిదలు కాస్తారా?
కాంగ్రెస్ నాయకులు ఇదే అహంకారంతో మాట్లాడితే....మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి పథకం పేరును కచ్చితంగా మారుస్తాం. 9 నెలలలో రేవంత్ రెడ్డి సాధించిన గొప్ప విజయం ఢిల్లీకి 20 సార్లు పోయిరావడం. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఇతర ప్రాంత వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీని పంపారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని పదవులను తెలంగాణేతరులకు అప్పజెప్పుతుంది. అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని ముఖ్యమంత్రి అంటే మరి తెలంగాణ నుంచి ఎంపికైనా ఎనిమిది మంది ఎంపీలు గాడిదలు కాస్తారా? మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి మోసం చేసి అభిషేక్ మను సింఘ్వీ కి ఇచ్చారు’’ అని కేటీఆర్ అన్నారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Tank Bund Shiva:ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Hyderabad Drugs Party: హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్
హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget