అన్వేషించండి

KCR: ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం, చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..

తొలుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సీఎం స్వయంగా ప్రధాని పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది.

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. నేడు కేసీఆర్‌ స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ప్రధాని పర్యటనలో పాల్గొనలేకపోతున్నట్లుగా సీఎంవో వర్గాలు తెలిపాయి. నిజానికి ప్రధాని పర్యటనకు స్వాగతం పలికేందుకు తొలుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సీఎం స్వయంగా ప్రధాని పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టింది మొదలు తిరిగి వెళ్లేవరకూ కేసీఆర్ పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు చివరి నిమిషంలో మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేదు. ఆయన స్వల్ప అస్వస్థతతో ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

నిజానికి ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా రాష్ట్ర రాజధానిలో జరిగే ప్రధాని అధికారిక కార్యక్రమాలకు గవర్నర్‌, ముఖ్యమంత్రి, నగర మేయర్‌, సీఎస్‌, డీజీపీ తప్పకుండా హాజరై స్వాగతించాలి. అయితే, అనధికార కార్యక్రమాలు అయితే పాల్గొనాల్సిన అవసరం లేదు. విగ్రహావిష్కరణ అధికారిక కార్యక్రమం కాదని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. మరి ఇక్రిషాట్‌లో జరిగిన కార్యక్రమం అధికారికమా అనాధికారికమా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య విభేదాల కారణంగానే కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ పర్యటనలో పాల్గొనడం లేదని బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. దేశ ప్రధానికి జరిగిన అవమానంగా పేర్కొంటోంది.  

KCR: ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం, చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..

ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ మధ్య కేంద్ర బడ్జెట్‌ విషయంలో ప్రధాని మోదీపై కేసీఆర్‌ నిప్పులు చెరిగినందున ఆయన దూరంగా ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు. 

ఆరేళ్ల క్రితం ఒకే వేదికపై ఇద్దరూ..
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఒకే వేదికపై కనిపించి దాదాపు 6 ఏళ్లు అవుతోంది. 2016లో గజ్వేల్‌లో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. రెండోసారి ఇద్దరూ అధికారంలోకి వచ్చాక.. 2020 నవంబర్‌లో మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. హాకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో విమానం దిగిన మోదీ.. నేరుగా భారత్‌ బయోటెక్‌ పరిశ్రమకు వెళ్లి.. కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలతో చర్చించారు. అటు నుంచే తిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం ఇతర పరిస్థితుల నేపథ్యంలో.. గవర్నర్‌గానీ, సీఎంగానీ ఎవరూ ప్రధాని పర్యటనకు రావొద్దని పీఎంవో సమాచారం అందించింది. దాంతో అప్పుడు ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొనలేదు.

KCR: ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం, చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget