అన్వేషించండి

Telangana News: రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

Caste census in Telangana | సమగ్ర ఇంటింటి సర్వే రికార్డు వేగంతో పూర్తి చేసి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేబినెట్ సబ్ కమిటీకి ఫిబ్రవరి 2లోగా నివేదిక రానుంది.

హైదరాబాద్: ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే (Samagra Kutumba Survey) దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాష్ట్ర (Telangana) ప్రభుత్వం చేపట్టిన సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
సమగ్ర సర్వే డేటా ఎంట్రీ పూర్తి
సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించారంటూ అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కుల గణన ప్రక్రియ (Caste Census) సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  బీసీ డెడికేటేడ్ కమిషన్ (BC Commission)కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ సైతం పూర్తయిందని, ఒకట్రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఫిబ్రవరి 2 లోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

తెలంగాణలో నవంబర్ 6న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే) ప్రభుత్వం ప్రారంభించింది. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వేలో సూపర్​ వైజర్లు, ఎన్యుమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికిపైగా పాలుపంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వే గుర్తించింది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే టీమ్స్ విజయవంతంగా సేకరించాయి. ఆ వివరాల డేటా ఎంట్రీ సైతం పూర్తయింది. కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం లాంటి కారణాలతో కొన్ని కుటుంబాల వివరాలు సర్వేలో సేకరించడం వీలుకాలేదని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. 

రికార్డు వేగంతో కుల గణన
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే సీఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేసేందుకు ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది. ఈ సర్వే చేపట్టేందుకు ఫిబ్రవరి 16న అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఇంటింటి సర్వే కుల గణన చేపట్టేందుకు విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 12వ తేదీన కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయగా, పలుమార్లు సబ్ కమిటీ సమావేశమైంది. అక్టోబర్ 9న కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారసులపై రేవంత్ రెడ్డి చర్చించారు. కుల గణన కలిసి వచ్చేలా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడానికి ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు పూర్తి విధి విధానాలతో జీవో నెం.18 ప్రభుత్వం జారీ చేసింది. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు వివరాలు సేకరించగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వే వివరాలను ఆన్‌లైన్ డేటా ఎంట్రీ పూర్తి చేశారు.

Also Read: Telangana News: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget