అన్వేషించండి

Secunderabad Railway Station: రైల్వేస్టేషన్‌లో విధ్వంసం మొదలైంది ఇలా, ట్రైన్‌కి నిప్పు అంటిస్తున్న వీడియోలు బయటికి

Secunderabad Riots: ప్యాసింజర్ బోగీలోకి వెళ్లిన యువకుడు కొన్ని పేపర్ల కట్టను అగ్గిపెట్టెతో అంటించి, తొలుత సీట్లకు నిప్పు పెట్టాడు. ఇతణ్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్వీరాజ్‌ గా గుర్తించారు.

Agneepath Protests In Secunderabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో కీలక ఫుటేజీ బయటికి వచ్చింది. విధ్వంసం, అల్లర్లు మొదలు కావడానికి ముందు కొందరు యువకులు రైలుకు నిప్పు అంటిస్తున్న వీడియోలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అంతేకాక, ఇనుప రాడ్లతో ఏసీ రైలు బోగీలను పగల గొట్టారు. ప్లాట్ ఫాంపైన ఉన్న ఫుడ్ స్టాళ్లను నాశనం చేశారు. కొందరు యువకులే ఈ అన్ని పనులకు పాల్పడ్డట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల ద్వారా స్పష్టం అవుతోంది.

ప్యాసింజర్ బోగీలోకి వెళ్లిన యువకుడు కొన్ని పేపర్ల కట్టను అగ్గిపెట్టెతో అంటించి, తొలుత సీట్లకు నిప్పు పెట్టాడు. ఇతణ్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్వీరాజ్‌ గా గుర్తించారు. కొంత మంది యువకులు ఈ నేరాలకు పాల్పడుతుండగా, మరికొందరు వాటిని ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత నిందితులే ఆ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రైలుకు నిప్పు పెట్టిన యువకుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోనికి తీసుకోని విచారణ చేస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ యువకుడు ఈ అల్లర్ల కేసులో ఏ - 12 గా ఉన్నాడు. అతనితో పాటు మరో 9 మంది నిందితులను కూడా గుర్తించారు. ఇప్పటికే ఈ రైలుకి నిప్పు పెట్టిన యువకుడికి వైద్య పరిక్షలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో అతడిని రిమాండ్‌కు తరలించారు.

‘సాయి డిఫెన్స్ అకాడమీ’ నిర్వహకుడు సుబ్బారావు సహా 15 మందిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. సుబ్బారావు పాత్రపై కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లుగా సమాచారం. అలాగే పరారీలో ఉన్న 25 మంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 10 మంది వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు ఆందోళన కారులతో పాటు ఇప్పటి వరకూ పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు.

ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నం
ఈ సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్న వరంగల్‌ కు చెందిన ఓ యువకుడు గోవింద్‌ అజయ్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అజయ్‌.. తనపై కేసులు పెడతారేమోనని భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అజయ్‌ తల్లిదండ్రులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అజయ్‌ వాట్సాప్‌ మెసేజ్‌ రావడం వల్లే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. తాను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ అల్లర్లు జరిగాయని చెప్పాడు. తాను ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా తాను దరఖాస్తు చేశానని చెప్పాడు. ఈ ఆందోళనల వల్ల తనకు ఉద్యోగం రాదనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పాడు.

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget