అన్వేషించండి

Union Minister Kishan Reddy : తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులిచ్చింది, లెక్కల చిట్టా విప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy : తెలంగాణకు కేంద్రం వివిధ పథకాల ద్వారా వేల కోట్ల నిధులు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీచేశారు.

Union Minister Kishan Reddy : బీఆర్ఎస్ , బీజేపీ మధ్య లెక్కల వార్ నడుస్తోంది. కేంద్రం ఏం ఇచ్చిందంటూ తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తుంటే లెక్కలతో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధుల చిట్టా విప్పారు. తెలంగాణలో పట్టణాల పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని  కిషన్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా వరంగల్, కరీంనగర్ కు రూ. 392 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. అమృత్ పథకంలో తెలంగాణ నుంచి ఎంపికైన 12 పట్టణాలకు రూ. 833.36 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. అమృత్ పథకంలో భాగంగా తెలంగాణకు చెందిన 143 పట్టణాలలో రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకంలో రాష్ట్రానికి 2,49,465 ఇళ్లు మంజూరు చేశామని, వీటి నిర్మాణానికి ఇప్పటికే రూ. 3128.14 కోట్లు విడుదల చేశామని కేంద్రమంత్రి వెల్లడించారు.  

వరంగల్, కరీంనగర్ కు రూ.1000 కోట్లు 

దేశంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్, అర్బర్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకాలను ప్రారంభించిందని కిషన్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా వరంగల్, కరీంనగర్ పట్టణాలను ఎంపిక చేశామన్నారు.  స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమం కింద వరంగల్ కు రూ. 500 కోట్లు, కరీంనగర్ కు రూ. 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని స్పష్టంచేశారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద 50:50 లో కేంద్ర, రాష్ట్రాలు నిధులను కేటాయిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తదుపరి విడత నిధులను విడుదల చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.  

తెలంగాణకు  2,49,465 ఇళ్లు మంజూరు 

అమృత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. పట్టణాలలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అమృత్ పథకంలో భాగంగా పట్టణాలలో సంస్కరణల అమలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ రవాణా, ఉద్యానవనాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ పథకంలో తెలంగాణ నుంచి ఎంపికైన 12 పట్టణాలకు రూ. 833.36 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద కేంద్రం  తెలంగాణకు  రూ. 4465.81 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు రూ. 3128.14 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. ఈ పథకం కింద తెలంగాణకు 2,49,465 ఇళ్లను మంజూరు చేయగా, 2,39,422 ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని తెలిపారు. వీటిల్లో 2,15,443 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు స్పష్టం చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget