అన్వేషించండి

Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్, డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు : రేవంత్ రెడ్డి

Revanth Reddy: సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు అవుతుందనని జోస్యం చెప్పారు.

Revanth Reddy: హైదరాబాద్ లో ఇవాళ సీఎల్పీ(CLP) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొ్న్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.1200 మంది తెలంగాణ(Telangana) ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న రేవంత్ రెడ్డి...మహిళలపై జరుగుతున్న అఘాత్యాలలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటుందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చారని చెబుతున్నారని, మంత్రి హత్యకు(Minister Murder) సుపారీ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ నేతలే అన్నారు. 

ఎమ్మెల్యేల భూకబ్జాలు
 
'రాష్ట్రంలో ఎమ్మెల్యేల(Mla)భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. ధరణి లోపాల వల్ల హత్యలు జరుగుతున్నాయి. ఇవి కూడా శాంతి భద్రత వైఫల్యమే. రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. విభజన బిల్లు ద్వారా రావాల్సిన రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటివి సాధించలేదు. సీఎం కేసీఆర్ పరిపాలనలో కలెక్టర్, ఎస్పీలుగా అర్హతలేని వారిని నియమించి తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో బిహార్ కు చెందిన అధికారులకే ఉన్నారు. ఐదు మంది బిహార్ అధికారులకు 40 శాఖలు కేటాయించారు. సోమేశ్ కుమార్, అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ కు చెందిన వారిని ఇక్కడ పెట్టుకొని కీలక శాఖలు కేటాయించారు. బిహార్ అధికారులు కేసీఆర్ కు కృతజ్ఞతగా పరిపాలనను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు.' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

సోమేశ్ కుమార్ సర్వీస్ రికార్డు ఇవ్వడం లేదు 

సోమేశ్ కుమార్ సర్వీస్ రికార్డును గత రెండేళ్లుగా అడిగినా ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. గిరిజనులకు పోడు భూములను కుర్చీ వేసుకొని ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ వారిని నిండా ముంచారని విమర్శించారు. మెట్రో విషయంలో గౌలిగూడ నుంచి ఫలక్ నుమా వరకు పూర్తి చేయకుండా నిధులు మెక్కేశారని తీవ్ర విమర్శలు చేశారు. గౌలిగూడ నుంచి ఫలక్ నుమాకు మెట్రో వేస్తే అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందన్నారు. కానీ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వేస్తామని చెబుతున్నారన్నారు. వారి సంబంధికుల భూముల విలువ పెంచడం కోసం కుట్ర జరుగుతోందన్నారు. 

చత్తీస్ గఢ్ లో మంచి పథకాలు 

మంత్రి కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ గతంలో ఫామ్ హౌస్, డ్రగ్స్ విషయంలో సవాల్ విసిరి పారిపోయారని విమర్శించారు. తెలంగాణ కంటే చత్తీస్ గఢ్ లో మంచి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వరికి 1960 మద్దతు ధర ఉంటే చత్తీస్ గఢ్ క్వింటాలకు 2,500 ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వరి కుప్పలపై గుండె పగిలి రైతులు చనిపోతున్నారని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేన్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు అవుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గవర్నర్ ప్రసంగం జరిగితే ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే అవకాశం ఉండేదన్న ఆయన.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా మోడీకి వ్యతిరేకం అని చెప్పుకోవాలనే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారన్నారు. వర్నర్ ప్రసంగం జరిగితే కాంగ్రెస్ లోటుపాట్లను నిలదీస్తుందనే ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget