అన్వేషించండి

Revanth Reddy Letter : ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy Letter : ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఏడు ప్రశ్నలను తొలగించాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు.

Revanth Reddy Letter : సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆరోపించారు. పోలీసు విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారని, కొలువులు వస్తాయని ఆశించిన యువతకు ఈ పరీక్ష తీవ్ర ఆవేదనను మిగిల్చిందన్నారు. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విధానంలో కొలువుల భర్తీలో బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోందన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండు ప్రశ్నపత్రాల్లో చెరో 7 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఈ 7 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారన్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులిచ్చారని ఆరోపించారు.  అసలు సమాధానం ఇవ్వని వారికి సైతం మార్కులు కేటాయించారన్నారు. కానీ కొందరు అభ్యర్థులకు మాత్రం మార్కులు ఇవ్వలేదని తెలిపారు. 

హైకోర్టు ఆదేశాలు అమలు చేయండి 

ఈ విషయాన్ని అభ్యర్థులు తెలంగాణ స్టేట్  పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అయినా ఎటువంటి స్పందన లేకుండానే మెరిట్ జాబితాను రూపొందించి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు.  దీనిపై హైకోర్టు డిసెంబర్ 9న తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అభ్యర్థులు పేర్కొన్న 7 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు.  ఆ మేరకు అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశమివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50-60 వేల మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుందన్నారు. అభ్యర్థులు తమ ఆవేదనను ట్విట్టర్ లో కేటీఆర్, డీజీపీలకు విన్నవించుకున్నా సమాధానం రాలేదని ఆరోపించారు. సంబంధిత శాఖను చూసే హోం మంత్రి ఉన్నారా లేరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.  ఇవేమీ పట్టన్నట్లు బీఆర్ఎస్ అంటూ దేశమంతా తిరుగుతుంటారని మండిపడ్డారు. పాలన ఈ విధంగా ఉంటే  ఉద్యోగార్థుల సమస్యను తీర్చెదెవరు? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

అభ్యర్థుల్లో గందరగోళం

తెలంగాణ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో పలు ప్రశ్నల విషయంలో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. మొత్తం 13 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల నుంచి టీఎస్ఎల్‌పీఆర్బీ ఫిర్యాదులు కూడా ఆహ్వానించింది. ఈ తప్పుల విషయంపై హైకోర్టులో పలువురు పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ధర్మాసనం అభ్యర్థులు పేర్కొన్న 7 ప్రశ్నలు తొలగించాలని ఆదేశించింది. ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో పలు తప్పులు దొర్లాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించిన అధికారులు మొత్తం 8 మార్కులు కలిపారు. అభ్యర్థులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌లు డిసెంబర్‌ 8 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్స్‌ నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 సెంటర్లను రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుచేసింది. ఈ మొత్తం ప్రక్రియను 25 రోజుల్లో పూర్తి చేయనున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget