అన్వేషించండి

Minister KTR : దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక విధానాలు, కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

Minister KTR : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆర్థిక వ్యవస్థపై చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం వైఫల్యాలను దాచేందుకు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Minister KTR : కేంద్ర ఆర్థిక విధానాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.  నిర్మలా సీతారామన్ డొంక తిరుగుడు ప్రసంగంతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని కేటీఆర్ విమర్శించారు.  పార్లమెంట్ లో  దేశ ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణం వల్ల సాధారణ ప్రజల పడుతున్న బాధలపై నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెప్పారన్నారు. లోక్ సభలో చేసిన తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది భారతీయులు పడుతున్న కష్టాలను ఆమె  అవహేళన చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కేంద్ర మంత్రి డొంక తిరుగుడు మాటలు మాట్లాడారన్నారు. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు.  దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వంలో చరిత్రలో నిలుస్తుందన్నారు. 

రూపాయి క్షీణత 

చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడిందని, 30 సంవత్సరాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 సంవత్సరాల అత్యధికం నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా తక్కువ స్థాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం ఇందుకు ఉదాహరణలు అని మంత్రి కేటీఆర్ అన్నారు. సాధారణ ప్రజలు ఉపయోగిచే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితమే అన్నారు. అనాలోచిత డిమానిటైజేషన్, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గత ఎనిమిది సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలో చతికిల పడిందన్నారు.  డిమానిటైజేషన్ కు ముందు 18 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో ఉంటే, ప్రస్తుతం 31 లక్షల కోట్లు నగదు చలామణిలో ఉందన్నారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 68 శాతం నగదు అధికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని, కేవలం నగదు ముద్రణకే అర్‌బీఐ ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. 

జీఎస్టీతో ఇబ్బందులు 

జీఎస్టీ ద్వారా దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని, అర్థంలేని పన్ను స్లాబ్ లతో పాటు, ప్రజలకు అత్యవసరమైన వస్తువులపై భారీగా పన్నులు విధించి దోపిడీ చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు పరిశ్రమలను, పారిశ్రామిక వర్గాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రజలు ఉపయోగించే పాలు, పెరుగు, బియ్యం వంటి అత్యవసర వస్తువుల పైనా భారీగా పన్ను వేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేనేత వస్త్రాలపై కూడా జీఎస్టీ మోపిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పసిపిల్లలు వాడుకునే పెన్సిల్లు నుంచి హాస్పిటల్ బెడ్ల వరకు చివరికి అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోదీదని కేటీఆర్ మండిపడ్డారు.

పన్నుల భారం 

ప్రజలపై పెట్రో పన్నుల భారాన్ని మోపి కేంద్రం దోపిడీకి పాల్పడుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 2014 వరకు పెట్రోల్, డీజిల్ పైన ఉన్న కేంద్ర ప్రభుత్వ టాక్స్ లను భారీగా పెంచిదని,  పెట్రోల్ పై ట్యాక్స్ రెట్టింపు చేయడంతో పాటు డీజిల్ పైన సుమారు నాలుగున్నర రెట్లు పెంచిందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు పెట్రో పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్రాలకు సమానపు ఆదాయం వస్తుంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన భారీ  పన్నుల వలన మోదీ ప్రభుత్వం దాదాపు రెండున్నర రెట్లు ఆదాయం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుందన్నారు. పెంచిన పెట్రో పన్నుల భారం నేరుగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసి ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు.

క్రోనీ క్యాపిటలిజం 

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే  మోదీ ప్రభుత్వ  అసలైన ఆర్థిక విధానాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వ్యక్తులు, పార్టీలపైన కేంద్ర ప్రభుత్వ  యంత్రాంగాలను ఉసిగొలిపి, విభజించు పాలించు అనే దుర్నీతితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా లేని గొప్పలు చెప్పుకోవడం మాని, దేశ ప్రజల హితం కోసం ద్రవ్యోల్బాణాన్ని అదుపులోకి తీసుకువచ్చి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ హితవు  పలికారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Kavitha: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
AI career certificate: గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
Ideas of India 2026 Nara Lokesh: గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
Vijay Sangeetha Divorce: నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
Embed widget