అన్వేషించండి

Minister KTR : దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక విధానాలు, కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

Minister KTR : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆర్థిక వ్యవస్థపై చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం వైఫల్యాలను దాచేందుకు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Minister KTR : కేంద్ర ఆర్థిక విధానాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.  నిర్మలా సీతారామన్ డొంక తిరుగుడు ప్రసంగంతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని కేటీఆర్ విమర్శించారు.  పార్లమెంట్ లో  దేశ ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణం వల్ల సాధారణ ప్రజల పడుతున్న బాధలపై నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెప్పారన్నారు. లోక్ సభలో చేసిన తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది భారతీయులు పడుతున్న కష్టాలను ఆమె  అవహేళన చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కేంద్ర మంత్రి డొంక తిరుగుడు మాటలు మాట్లాడారన్నారు. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు.  దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వంలో చరిత్రలో నిలుస్తుందన్నారు. 

రూపాయి క్షీణత 

చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడిందని, 30 సంవత్సరాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 సంవత్సరాల అత్యధికం నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా తక్కువ స్థాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం ఇందుకు ఉదాహరణలు అని మంత్రి కేటీఆర్ అన్నారు. సాధారణ ప్రజలు ఉపయోగిచే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితమే అన్నారు. అనాలోచిత డిమానిటైజేషన్, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గత ఎనిమిది సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలో చతికిల పడిందన్నారు.  డిమానిటైజేషన్ కు ముందు 18 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో ఉంటే, ప్రస్తుతం 31 లక్షల కోట్లు నగదు చలామణిలో ఉందన్నారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 68 శాతం నగదు అధికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని, కేవలం నగదు ముద్రణకే అర్‌బీఐ ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. 

జీఎస్టీతో ఇబ్బందులు 

జీఎస్టీ ద్వారా దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని, అర్థంలేని పన్ను స్లాబ్ లతో పాటు, ప్రజలకు అత్యవసరమైన వస్తువులపై భారీగా పన్నులు విధించి దోపిడీ చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు పరిశ్రమలను, పారిశ్రామిక వర్గాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రజలు ఉపయోగించే పాలు, పెరుగు, బియ్యం వంటి అత్యవసర వస్తువుల పైనా భారీగా పన్ను వేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేనేత వస్త్రాలపై కూడా జీఎస్టీ మోపిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పసిపిల్లలు వాడుకునే పెన్సిల్లు నుంచి హాస్పిటల్ బెడ్ల వరకు చివరికి అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోదీదని కేటీఆర్ మండిపడ్డారు.

పన్నుల భారం 

ప్రజలపై పెట్రో పన్నుల భారాన్ని మోపి కేంద్రం దోపిడీకి పాల్పడుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 2014 వరకు పెట్రోల్, డీజిల్ పైన ఉన్న కేంద్ర ప్రభుత్వ టాక్స్ లను భారీగా పెంచిదని,  పెట్రోల్ పై ట్యాక్స్ రెట్టింపు చేయడంతో పాటు డీజిల్ పైన సుమారు నాలుగున్నర రెట్లు పెంచిందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు పెట్రో పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్రాలకు సమానపు ఆదాయం వస్తుంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన భారీ  పన్నుల వలన మోదీ ప్రభుత్వం దాదాపు రెండున్నర రెట్లు ఆదాయం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుందన్నారు. పెంచిన పెట్రో పన్నుల భారం నేరుగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసి ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు.

క్రోనీ క్యాపిటలిజం 

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే  మోదీ ప్రభుత్వ  అసలైన ఆర్థిక విధానాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వ్యక్తులు, పార్టీలపైన కేంద్ర ప్రభుత్వ  యంత్రాంగాలను ఉసిగొలిపి, విభజించు పాలించు అనే దుర్నీతితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా లేని గొప్పలు చెప్పుకోవడం మాని, దేశ ప్రజల హితం కోసం ద్రవ్యోల్బాణాన్ని అదుపులోకి తీసుకువచ్చి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ హితవు  పలికారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dosha Nivaran : వివాహం, గృహప్రవేశం సహా అన్ని ముహూర్తాలు మీరే చూసుకోవచ్చు! పురాతన శాస్త్రాల ఆధారిత “దోష నివారణ” యాప్‌!
వివాహం, గృహప్రవేశం సహా అన్ని ముహూర్తాలు మీరే చూసుకోవచ్చు! పురాతన శాస్త్రాల ఆధారిత “దోష నివారణ” యాప్‌!
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
Double Bedroom Housing Scheme: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Price Hike India 2026: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Embed widget