అన్వేషించండి

MP Uttam Kumar Reddy : మునుగోడు ఉపఎన్నిక కోసం కేసీఆర్ ట్రిక్, రూ. 10 లక్షల సాయం మరో ఎండమావి- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

MP Uttam Kumar Reddy : మునుగోడు ఉపఎన్నిక కోసం సీఎం కేసీఆర్ గిరిజన బంధు అనే ట్రిక్ వాడుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

MP Uttam Kumar Reddy : ఎస్టీ రిజర్వేషన్ల కోటా పెంపు, గిరిజన బంధుపై సీఎం కేసీఆర్‌ హామీలు బూటకమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగ, విద్యలో కోటా పెంపుపై ముఖ్యమంత్రి నకిలీ హామీలతో షెడ్యూల్డ్ వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 6% రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు పథకం ద్వారా అర్హులైన ఎస్టీ కుటుంబాలకు రూ.10 లక్షల సాయం మరో ఎండమావి లాంటిదని ఆయన అన్నారు. ఎస్టీ కోటాను 10 శాతం పెంచాలని 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, ఉద్యోగాలు, విద్యలో ఎస్టీ కోటాను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రికి అనేక సార్లు ఫిర్యాదు చేశామన్నారు.  6 శాతం నుంచి 10 శాతం పెంచాలనే అంశాన్ని తాను గతంలో చాలా సార్లు పార్లమెంట్ లో లేవనెత్తానన్నారు. ఈ ఏడాది ఆగస్టు 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా ఒక వినతిపత్రం కూడా ఇచ్చానన్నారు. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎస్టీ కోటా పెంపునకు జీవో జారీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారని కానీ ఆయన ప్రకటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం కేసీఆర్‌ పన్నుతున్న ట్రిక్‌ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు.  

జోవో వెంటనే జారీ చేయాలి 

ఎస్టీలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో జారీ చేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాధారణ జీవో జారీ చేయడానికి వారం రోజులు ఆగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉంటే గంటలోపే పూర్తి చేయొచ్చన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ సాకుతో మరింత జాప్యం చేసే విధంగా ప్రకటనను కాలయాపన చేస్తున్నారన్నారు.  జూన్-జూలై 2014లోనే జీవో జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కోటాను 10 శాతానికి పెంచితే ఎంతో మందికి లబ్ధి జరిగేదని అన్నారు.  పెంచడంలో జాప్యంతో గత ఎనిమిదేళ్లలో ఎస్టీ కమ్యూనిటీ వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కళాశాలల్లో లక్షలాది సీట్లను కోల్పోయారన్నారు. ఈ నష్టానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో 10% పెంచిన ఎస్టీ కోటాను అమలు చేయాలని సూచించారు.

రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర

బీజేపీ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని, ఎస్టీ కోటాను 10 శాతానికి పెంచడాన్ని ఎప్పటికీ ఆమోదించదని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. దేశమంతటా ఉన్న రిజర్వేషన్లను అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించరు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడానికి మాత్రమే అన్ని రంగాలు, పీ.ఎస్.యూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇది కేవలం ఎస్టీలు, ఎస్సీలు, ఇతర వర్గాల కోటాల పెంపు ప్రతిపాదనలకు బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించడం సమయం వృధా అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

పోడు భూములు లాక్కున్న ఘనత టీఆర్ఎస్ దే 

"పోడు భూముల సమస్యను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టించింది. ఎన్నో దశాబ్దాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న ఎస్టీలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు కల్పించింది. హరితహారం తదితర కారణాలతో గిరిజనుల నుంచి పోడు భూములను లాక్కున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. పోడు భూములపై ​​గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పించడం ఎస్టీలకు కేసీఆర్ చేస్తున్న ఉపకారం కాదు, హక్కుల కోసం పోరాడుతున్న వేలాది మంది ఎస్టీల ముందు ఆయన ప్రభుత్వం లొంగిపోయింది. తెలంగాణలో పోడు భూముల ఆందోళనలో గిరిజనులపై నమోదు చేసిన కేసులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి."- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 

మూడెకరాల భూమి ఎప్పుడిస్తారు

దళిత బంధు పథకం కింద దాదాపు 17 లక్షల పేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందజేస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వం 5 వేల కుటుంబాలకు కూడా సాయం చేయలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలను  ‘గిరిజన బంధు’ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసి, అన్ని ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామంటూ ప్రచారం కల్పించారని విమర్శించారు. ఇది కేసీఆర్ చేస్తున్న మరో మోసం అన్నారు. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజన బంధు పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్టీ కుటుంబాలకు హామీ ఇచ్చిన మూడెకరాల భూమి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కొత్త  గ్రామ పంచాయతీలుగా మారిన లంబాడా తాండాలకు మౌలిక వసతుల కల్పనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ రాజధాని అమరావతిలో భూములు పరిశీలిస్తున్న సింగపూర్ టీమ్
ఏపీ రాజధాని అమరావతిలో భూములు పరిశీలిస్తున్న సింగపూర్ టీమ్
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget