అన్వేషించండి

Eatala Rajender: హైదరాబాద్ పోవాలంటే బాంబులు పేలి చనిపోతారని భయం!: ఈటల సంచలన వ్యాఖ్యలు

BJPs Vijay Sankalp Yatra: పదేళ్ల కిందట హైదరాబాద్ పోవాలంటే బాంబులు పేలి చనిపోతారు అనే భయం ఉండేదని, మోదీ వచ్చాక బాంబుల మోతలు ఆగిపోయాయని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajender at BJPs Vijay Sankalp Yatra: గజ్వేల్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న కోపమే కారణమని.. అందుకే ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందని, ప్రధాని మోదీ మీద నమ్మకంతో బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కిందట హైదరాబాద్ పోవాలంటే బాంబులు పేలి చనిపోతారు అనే భయం ఉండేదని, మోదీ వచ్చాక బాంబుల మోతలు ఆగిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఎటు చూసినా కుంభకోణాలే.. 
మహిళలు, యువత ప్రధాని మోదీ వెంట ఉన్నాని, ఆయనను మరోసారి గెలిపించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ పాలన ఎటు చూసినా కుంభకోణాలే కనిపించేవని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకంతో పేదలకు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ సాధించి, మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ఈటల ఆకాంక్షించారు.

విజయ సంకల్పయాత్రలో భాగంగా రాజరాజేశ్వర క్లస్టర్ - మెదక్ లో రోడ్ షో లో ఈటల పాల్గొని ప్రసంగించించారు. ‘’మోదీ పేద ఇంటి నుండి వచ్చిన బిడ్డ కాబట్టి పేదల కష్టాలు తీరుస్తున్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదు అని ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ 4 కోట్ల ఇల్లు కట్టించి ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తా అని కేసీఆర్ మోసం చేశాడు. గ్రామపంచాయితీ సిబ్బందికి కూడా మోదీ డబ్బులు పంపించకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెట్లు, లైట్లు, మోరీలు, రోడ్లు అన్నీ కేంద్ర నిధులతోనే వేస్తున్నారు. సఫాయి కార్మికుల కాళ్లుకడిగి గౌరవం పెంచితే, కేసీఆర్ 1700 మంది ఉద్యోగాలు తీసివేశారు.

కరోనా వ్యాప్తి సమయంలో దేశానికి ధైరాన్ని అందించిన వ్యక్తి ప్రధాని మోదీ. ప్రపంచానికి వాక్సిన్ అందించారు. కరోనా సమయం నుండి 5 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. పేదవాడు అధికారంలో ఉంటే ఏం చేస్తాడో చేసి చూపించారు నరేంద్ర మోదీ. 500 సంవత్సరాల కిందట అయోధ్యలో కూలగొట్టిన రామమందిరం తిరిగి నిర్మించారు. అయోధ్యలో రాముడు ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది అని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారు. ఒకప్పుడు భారతదేశం నుండి వచ్చారు అంటే విదేశాలలో చిన్న చూపు ఉండేది, కాని ఇప్పుడు గల్లా ఎగురవేసుకుని నేను భారతీయున్ని అని చెప్పుకొనే స్థాయికి తీసుకువచ్చారు’ అని ఈటల పేర్కొన్నారు.

కాంగ్రెస్ వాళ్లు వస్తే.. ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. 4 వేల వృద్ధాప్య  పెన్షన్ అన్నారు. 6 వేలు వికలాంగుల పెన్షన్ అన్నారు. రైతులు అప్పుకట్టవద్దు. నేను వస్తే 2 లక్షల మాఫీ అన్నారు. మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు. బస్ ఫ్రీ పెట్టారు కానీ బస్సులు లేవు. మోసం, అన్యాయం లేకుండా పాలన సాగాలంటే మోదీ మళ్ళీ ప్రధాని కావాలి, అందుకే ఈ విజయసంకల్ప యాత్ర చేస్తున్నామని’ మాజీ మంత్రి ఈటల వివరించారు. 

మల్లన్నసాగర్ లో 9 గ్రామాలు మునిగిపోయాయి.. ఆ రైతులు అడ్డా మీద కూలీగా మారిపోయారని చెప్పారు. ఇళ్లు పోయిన వారికి 250 గజాల జాగా ఇస్తా అన్నారు.. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి కలెక్టర్ ని తెచ్చి దొంగ పట్టాలు ఇచ్చారు. అవి పనికి రాకుండా పోయాయని మండిపడ్డారు. ప్రాజెక్ట్స్ కి బీజేపీ వ్యతిరేకం కాదు కానీ వెలకట్టలేని బంధం వదిలిపెట్టి వచ్చిన కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏమిటి ? వారిని దిక్కులేకుండా చేసింది కేసీఆర్  కాదా ? అని ఈటల ప్రశ్నించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget