అన్వేషించండి

రజత్ కుమార్ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?- తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

IAS Rajith Kumar: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రజత్ కుమార్ వివాహానికి అయిన ఖర్చు కేసు ఎంత వరకు వచ్చిందని ఢిల్లీ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

IAS Rajith Kumar: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఖర్చు ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విచారణ ఏ దశలో ఉందని జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని.. ఆరు వారాల్లోగా నివేదిక అందిస్తామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ ధర్మాసనానికి తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కూతురు వివాహ వేడకకు రాష్ట్రంలోని ఓ ప్రైవేటు కంపెనీ భారీగా ఖర్చు పెట్టిందని, రజత్ కుమార్ కు ఆ కంపెనీకి మధ్య క్విడ్  ప్రొ కో నడిచిందని నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిల్లీ హైకోర్డులో పపిటిషన్ దాఖలు చేశారు. 

అసలేం జరిగిందంటే?

గతేడాది డిసెంబర్ లో రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ తన కూతురు వివాహ వేడుకను హైదారాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూంల ఏర్పాట్లను ఓ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు, ఇన్ వాయిస్ డేటా ఆధారాలతో మీడియాలో వచ్చింది. తాజ్ హోటల్ గ్రూపునకు బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్‌ కంపెనీకి చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు, బిల్లులతో ఆ కంపెనీకి సంబంధం ఉందని బయట పెట్టింది. 

ఒక్కో ప్లేటు భోజనానికి 16, 520 రూపాయలు..

స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకర రావు ఇద్దరూ ఆ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్టినేట్ చేసినట్లు తెలిపింది. పెళ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూములు బుక్ చేశారని, నిరుడు జులై 31న బుకింగ్స్ కోసం హోటళ్లకు మెయిల్స్ వెళ్లాయని వివరించింది. అంతకు ఒక నెల ముందు అంటే జులై1వ తేదీన బిగ్ వేవ్ ఇన్ ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ది న్యూస్ మినిట్ వివరించింది. కంపెనీ అడ్రస్ ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. డిసెంబర్ 20వ తేదీన ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ.16,520 చొప్పున బిల్లింగ్ అయిందని చెప్పుకొచ్చింది. 

అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తన కూతురు పెళ్లికి తానే ఏర్పాట్లు చేసుకున్నాని రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. కంపెనీకి, ఆ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది కంపెనీకి అంటగట్టడం సరైనది కాదని సదరు కాంట్రాక్ట్ కంపెనీ తెలిపింది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Embed widget