అన్వేషించండి

KCR Delhi Tour: నేడు కేసీఆర్ - కేజ్రీవాల్ భేటీ? బీజేపీ, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌పైనే చర్చలు!

KCR Kejriwal Meet: అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు జాతీయ స్థాయి కీలక నేతలతోనూ సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

KCR In Delhi: ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో భాగంగా సోమవారం రాత్రి కేసీఆర్ ఢిల్లీకి (KCR Delhi Tour) వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో అరవింద్‌ కేజ్రీవాల్‌తో (Aravind Kejriwal) పాటు మరికొందరు జాతీయ స్థాయి కీలక నేతలతో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ జే.సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ ఇతన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. 

ఇప్పటికే ప్రత్యామ్నాయ కూటమి (Third Front) ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ కేజ్రీవాల్‌ సమావేశం (KCR Kejriwal Meet) అవుతారని తెలుస్తోంది. అయితే, కేసీఆర్, కేజ్రీవాల్ ఇలా భేటీ కావడం ఇదే తొలిసారి. వీరిద్దరి సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిపై చర్చించే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌తో భేటీ తర్వాత ఢిల్లీలోని కొన్ని జాతీయ పార్టీల నాయకులను కూడా కేసీఆర్ కలుస్తారు. విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోనూ సమావేశం అవుతారు. జాతీయ ప్రత్యామ్నాయ వేదిక కోసం సహకారం అందించాలని వారిని ఆహ్వానించారు. 

కేంద్ర మంత్రులతోనూ భేటీ
ప్రత్యామ్నాయ కూటమిపై చర్చలే కాకుండా కేసీఆర్ కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశం సహా నిధులు వంటి అంశాలకు సంబంధించి ఆయా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులను రప్పించడం, యాసంగి ధాన్యం కొనుగోలు, విభజన హామీలు - సమస్యలు, నిధులపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉండదని తెలుస్తోంది.

8న వనపర్తి పర్యటనకు కేసీఆర్ (KCR Wanaparthy Tour)
ఢిల్లీ పర్యటన అనంతరం మార్చి 8న వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. అలాగే జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్ట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను, అలాగే టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లా కేంద్రంలో తలపెట్టిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget