అన్వేషించండి

KTR: 'కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర' - సర్కారుకు రాజకీయాలే ముఖ్యమయ్యాయని కేటీఆర్ విమర్శలు

BRS Medigadda Tour: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ట రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు నిజాలు తెలియజేసేందుకే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామన్నారు.

KTR Slams Telangana Government in Medigadda Issue: కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరిచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ 'చలో మేడిగడ్డ' పర్యటన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అంతే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాకాలం వచ్చే లోపు ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడడానికే తాము చలో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దని అన్నారు. 

'కాళేశ్వరంపై దుష్ప్రచారం'

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని.. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా దీన్ని కేసీఆర్ నిర్మించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 'కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం లేనిది ఉన్నట్లు, ఏదో జరిగినట్లు చూపిస్తోంది. ప్రాజెక్టును జీర్ణించుకోలేకే దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి. మేడిగడ్డ బ్యారేజీలోని 84 పిల్లర్లలో  3 మాత్రమే కుంగాయి. లోపాలను సవరించాలి కానీ దీనిపై రాజకీయం చెయ్యొద్దు. రాజకీయాలు చేసేందుకే మేడిగడ్డను వాడుకుంటున్నారు.' అని మండిపడ్డారు.

మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. పార్టీ అధినేత కేసీఆర్ మినహా కేటీఆర్, పోచారం సహా ఇతర ముఖ్య నేతలంతా ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. తొలుత మేడిగడ్డ సందర్శన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు.  ఆ తర్వాత అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజలకు నిజా నిజాలు తెలియజేసేందుకే ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. 

Also Read: Tatikonda Rajaiah: తాటికొండ రాజయ్య సతమతం! ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా - కాంగ్రెస్‌లోకి దారులు క్లోజ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Musi Revival Project: అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Telangana Assembly: కేటీఆర్ రాజీనామా సవాల్ - డీటైల్స్ ఇచ్చిన సీతక్క - అసెంబ్లీలో హైవోల్టేజ్ పాలిటిక్స్ !
కేటీఆర్ రాజీనామా సవాల్ - డీటైల్స్ ఇచ్చిన సీతక్క - అసెంబ్లీలో హైవోల్టేజ్ పాలిటిక్స్ !

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Embed widget