AP Telangana Breaking News: నేతల ఆడియో టేపులపై విచారణ అవసరం : వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రక్షా బంధన్ అనేది అన్నాచెల్లె్ళ్లు లేదా అక్కా తమ్ముళ్ల బంధానికి చిహ్నమని, ఇది ఒక గొప్ప భారతీయ సాంప్రదాయమని కొనియాడారు. మరోవైపు, సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
నేతల ఆడియో టేపులపై విచారణ అవసరం : వాసిరెడ్డి పద్మ
నేతల ఆడియో టేపులపై విచారణ అవసరమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘‘ఆ మాటలు తమవి కావని నేతలు అంటున్నారు. నేతల వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేతల ఆడియో టేపుల ఘటనపై విచారణ కోరతాం. మహిళా కమిషన్ తరఫున సమాచారం తెప్పించుకుంటాం. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు. రమ్య ఘటనపై టీడీపీ 21 రోజుల డెడ్లైన్ సరికాదు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇటీవల పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో నేత అంబటి రాంబాబులకు సంబంధించిన ఆడియో టేపు లీకవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
కవిత చిన్నప్పటి ఫోటో చూశారా?
ఎంపీ సంతోష్ కుమార్కు తన చెల్లెలు కవిత సహా మరో సోదరి రాఖీ కట్టారు. ‘‘చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోవడం మర్చిపోలేని విషయం. ప్రతి రక్షా బంధన్ మర్చిపోలేని అనుభూతులను మిగుల్చుతుంది. నా చెల్లెళ్లు రాఖీ కట్టడంలో అప్పటికీ ఇప్పటికీ ఎఫెక్షన్ ఇంకా పెరిగింది’’ అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. తాము టీనేజ్లో ఉండగా రాఖీ కట్టించుకున్న ఫోటోను కూడా ఎంపీ ట్వీట్ చేశారు.
#Sisters and #Rakhi goes incredible! Every Raksha Bandhan always leaves memorable moments for all of us. Clicks with my adorable sisters after tying Rakhi today then and now. Increased affection🥰. #HappyRakshaBandhan pic.twitter.com/FkSvaQKStX
— Santosh Kumar J (@MPsantoshtrs) August 22, 2021





















