అన్వేషించండి

AP Telangana Breaking News: నేతల ఆడియో టేపులపై విచారణ అవసరం : వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
AP Telangana Breaking News: నేతల ఆడియో టేపులపై విచారణ అవసరం : వాసిరెడ్డి పద్మ

Background

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రక్షా బంధన్ అనేది అన్నాచెల్లె్ళ్లు లేదా అక్కా తమ్ముళ్ల బంధానికి చిహ్నమని, ఇది ఒక గొప్ప భారతీయ సాంప్రదాయమని కొనియాడారు. మరోవైపు, సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.

13:18 PM (IST)  •  22 Aug 2021

నేతల ఆడియో టేపులపై విచారణ అవసరం : వాసిరెడ్డి పద్మ

నేతల ఆడియో టేపులపై విచారణ అవసరమని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘‘ఆ మాటలు తమవి కావని నేతలు అంటున్నారు. నేతల వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేతల ఆడియో టేపుల ఘటనపై విచారణ కోరతాం. మహిళా కమిషన్‌ తరఫున సమాచారం తెప్పించుకుంటాం. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్‌ చూస్తూ ఊరుకోదు. రమ్య ఘటనపై టీడీపీ 21 రోజుల డెడ్‌లైన్‌ సరికాదు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇటీవల పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో నేత అంబటి రాంబాబులకు సంబంధించిన ఆడియో టేపు లీకవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

11:59 AM (IST)  •  22 Aug 2021

కవిత చిన్నప్పటి ఫోటో చూశారా?

ఎంపీ సంతోష్ కుమార్‌కు తన చెల్లెలు కవిత సహా మరో సోదరి రాఖీ కట్టారు. ‘‘చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోవడం మర్చిపోలేని విషయం. ప్రతి రక్షా బంధన్ మర్చిపోలేని అనుభూతులను మిగుల్చుతుంది. నా చెల్లెళ్లు రాఖీ కట్టడంలో అప్పటికీ ఇప్పటికీ ఎఫెక్షన్ ఇంకా పెరిగింది’’ అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. తాము టీనేజ్‌లో ఉండగా రాఖీ కట్టించుకున్న ఫోటోను కూడా ఎంపీ ట్వీట్ చేశారు.

11:50 AM (IST)  •  22 Aug 2021

ఈటలకు రాఖీ కట్టిన తుల ఉమ

ఈటల రాజేందర్ అన్నకు అండగా ఉంటామని అన్న కష్టం మా కష్టం.. అని బీజేపీ నాయకురాలు తుల ఉమ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న అక్కాచెల్లెళ్లు అందరం ఆయన వెన్నంటే ఉంటామని ఉమ అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఉమ రాఖీ కట్టారు. ప్రజలందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.

11:10 AM (IST)  •  22 Aug 2021

రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు రేవంత్, ఆయన సతీమణి స్వీట్లు తినిపించారు. ‘‘ప్రతి ఆడబిడ్డ.. ఆత్మవిశ్వాసంతో.. ఆర్థిక స్వావలంబనతో.. అన్ని రంగాలలో ఎదగాలని.. మనసారా కోరుకుంటూ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన సోదరుడిగా భావించే రేవంత్‌పై ఎమ్మెల్యే సీతక్కకు ప్రత్యేక అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన పాదయాత్ర సందర్భంగా సీతక్క చెప్పులు కూడా కొనిచ్చారు.

11:07 AM (IST)  •  22 Aug 2021

శ్రీశైలం ప్రాజెక్టులో పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే

శ్రీశైలం డ్యామ్ లో నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నారు. ముంబయికి చెందిన 12 మంది నిపుణులు సర్వే చేస్తున్నారు. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక ఎంత చేరిందో తేల్చేందుకు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో ప్రాజెక్టు నీటి నిల్వ 308.62 టీఎంసీలుగా ఉంది. 2009 వరదల సమయంలో 215.807 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోయింది. కేంద్ర నిధులతో హైడ్రో గ్రాఫిక్ సర్వే చేపట్టారు. గత పదేళ్లలో డ్యామ్ లో ఏ మేరకు పూడిక చేరిందో ఈ సర్వే ద్వారా నిపుణులు నిర్థరించనున్నారు. 15 రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. ఆ తర్వాత కర్నూలు పరిసర ప్రాంతాల్లో సర్వే జరుగుతుందని డ్యామ్ అధికారులు తెలిపారు 

10:58 AM (IST)  •  22 Aug 2021

దేశంలో కొత్తగా 30948 కరోనా కేసులు, 403 మరణాలు

భారత్​లో రోజు వారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,948 మంది వైరస్ సోకింది. మరో 403 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 38,487 మంది కరోనా​ను జయించారు. దేశంలో మొత్తం కోవిడ్ యాక్టివ్​ కేసుల సంఖ్య 3,53,398 గా ఉంది.

10:57 AM (IST)  •  22 Aug 2021

రాఖీ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈ రక్షా బంధన్ పండుగ సోదర సోదరీమణుల ఆత్మీయతకు, అనురాగానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌కు తన సోదరి శ్రీదేవి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.

10:24 AM (IST)  •  22 Aug 2021

మల్లన్నసాగర్‌‌కు గోదావరి నీటి రాకపై హరీశ్ రావు ట్వీట్

‘‘తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. ప్రజల మీద విశ్వాసంతో పట్టుదలతో పనిచేస్తే కానిదేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది.’’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్ స్వప్న సాక్షాత్కారం, తెలంగాణకు అమృత జలాభిషేకం. సాకారమైన మల్లన్న సాగరం. అనుమానాలు అపశకునాలు అవరోధాలు తలవంచి తప్పుకున్నయి. కుట్రలు కుహనా కేసులు వందల విమర్శలు వరద నీటిలో కొట్టుక పొయినయి. గోదారి గంగమ్మ మల్లన్న సాగరాన్ని ముద్దాడింది. కరువును శాశ్వతంగా సాగనంపింది.’’ అని మరో ట్వీట్ చేశారు.

10:21 AM (IST)  •  22 Aug 2021

రాఖీ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

రాఖీ పూర్ణిమ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గాంధే రాధిక-శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపీపీ పాపని-వెంకటేష్, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకా-తిరుపతి రెడ్డి, హుజురాబాద్  ఎంపీపీ ఇరుమల్ల రాణీ-సురేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

10:13 AM (IST)  •  22 Aug 2021

జగన్‌కు వైఎస్ షర్మిల రాఖీ విషెస్

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్‌ షర్మిల, సోదరుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి  సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. హ్యాపీ రాఖీ’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget