అన్వేషించండి

MP Arvind on BRS: "బీఆర్ఎస్ నాయకులు డెకాయిట్లుగా మారి ప్రజలను దోచుకుంటున్నారు"

MP Arvind on BRS: బీఆర్ఎస్ నాయకులు డెకాయిట్లుగా మారి తెలంగాణ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు.  

MP Arvind on BRS: నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు. డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ మాయ అని... 2021లో 10 వేల కోట్లు కేటాయించారని అన్నారు. ఇప్పటి వరకు దాని ఆడిటింగ్ ఊసే లేదంటూ కామెంట్లు చేశారు. రూ. 10875 కోట్లు డబుల్ బెడ్ రూమ్ కి కేటాయించి.. ఆ తర్వాత దాన్ని 4 వేల కోట్లకు కుదించారని చెప్పారు. ఆ డబ్బుల లెక్కలు ఇంత వరకు లేవంటూ ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. ప్రపంచంలో అతిపెద్ద పథకం ఆయుష్మాన్ భారత్ అని దాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసేవి కంత్రి పనులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు పడక గదుల విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణలో లక్షా 70 వేల ఇళ్లలో కేవలం 20 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని ఎంపీ అర్వింద్ అన్నారు. జగిత్యాలలో 40 శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ముస్లింలకు ఇచ్చారని..  వారికి ఏ లెక్కన ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. హౌసింగ్ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి జిల్లాకు చెందిన వాడే కావటం సిగ్గు చేటన్నారు. బీజేపీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని.. తన ఫౌండేషన్ ద్వారా వివిధ రూపాల్లో తన కార్యకర్తల కోసం రూ. 29 లక్షలు సాయం చేశామన్నారు. బీజేపీ డబ్బులిచ్చి ఓట్లు అడగదని.. బీజేపీ కార్యకర్తల కోసం ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలకు సాయం చేస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తేనే డబ్బులు పంచే సంస్కృతికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకం అని ఎంపీ అర్వింద్ తెలిపారు. సీఎంఆర్ చెక్కుల కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కడం దేనికని అన్నారు. ఓ గ్రామంలో మంత్రి ప్రజలతో మాట్లాడుతూ.. సీఎంఆర్ చెక్కుల కోసం కాళ్లు మొక్కానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ లను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. 

ఇండస్ట్రియల్ జోన్ లో రైతుల భూములు పోతున్నాయని... అసలు రాష్ట్రంలో ఒక్క ఫ్యాక్టరీ గాని ఒక్క ఇండస్ట్రీ గాని తీసుకొచ్చారా అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారని అన్నారు.ఒక్క ఇతనాల్ ఫ్యాక్టరీ తేలేదని చెప్పారు. సీఎం కాళ్లు మొక్కి షుగర్ ఫ్యాక్టరీ, ఇతనాయిల్ ఫ్యాక్టరీ తీసుకురా అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ ల పేరుతో టీఆరెస్ నాయకులు.. ప్రజల డబ్బులు దోచుకుంటున్నారని కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎస్ పథకం లేదని, ఫ్రీ ఎరువులు లేవని, ఆరోగ్య శ్రీ లేదని అన్నారు. చివరకు ఆరోగ్య బీమా కూడా లేదన్నారు. తెలంగాణలోనే దిక్కు లేదని, దేశంలో బీఆర్ఎస్ దూసుకుపోతోందని అంటున్నారని ఎంపీ అర్వింద్ ఎద్దేవ చేశారు. పేదలకు అవసరమయ్యే కొత్త పథకాల దిక్కు లేదని... ఫసల్ బీమా పథకం ఇప్పటి వరకు ప్రవేశ పెట్టలేదని చెప్పారు. వర్షాలకు పసుపు పంట నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతున్నారని.. అయినా ఫెసల్ బీమా పథకం ఊసే లేదన్నారు. తక్షణమే ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులకోసం సీఎం కేసీఆర్ కాళ్లు.. ప్రశాంత్ రెడ్డి ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు డెకాయిట్ లు గా మారారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman controversy: మిలిటెంట్ దాడులు చేద్దాం, ఆఫీసుల్ని తగులబెడదాం - బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపు వివాదాస్పదం
మిలిటెంట్ దాడులు చేద్దాం, ఆఫీసుల్ని తగులబెడదాం - బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపు వివాదాస్పదం
Bandi Bhageerath POCSO case: పొక్సో కేసులో బండి భగీరథ్‌కు కస్టడీ.. మూడు రోజుల పాటు విచారించనున్న పోలీసులు!
పొక్సో కేసులో బండి భగీరథ్‌కు కస్టడీ.. మూడు రోజుల పాటు విచారించనున్న పోలీసులు!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
Embed widget