అన్వేషించండి

Kishan Reddy : 35 శాతం ఓట్లు 10 లోక్‌సభ సీట్లు - తెలంగాణలో టార్గెట్ డిసైడ్ చేసుకున్న బీజేపీ !

Telangana BJP : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

 

Telangana BJP plan :   తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెల్చుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం లక్షాన్ని డిసైడ్ చేసుకుంది.  రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యంగా ఇవాళ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్‌తోపాటు నేతలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు.        

సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపైనా చర్చలు జరిపారు.  పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపైనా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఎవరిని నియమించాలనేది ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు  పార్టీ అధ్యక్షుడు కిషన్‌ ​రెడ్డి సమక్షంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని అనేక మంది పరిపాలించారని ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పదేళ్లుగా నరేంద్రమోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.               

ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కిషన్రెడ్డి తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్​ నేతృత్వంలో ఫ్రంట్​ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు.  అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వేలన్ని కూడా నరేంద్ర మోడీకి ఎవరూ పోటీకి దరిదాపుల్లో లేరని స్పష్టం చేశాయన్నారు. దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాను మోది అరికట్టారని ఆయన అన్నారు. దేశాన్ని అనేక మంది పరిపాలించారు.. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక్క అవినీతి మరక అని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లుగా నరేంద్ర మోడీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు కిషన్‌ రెడ్డి. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని చర్చ జరుగుతోందని, ఫ్రంట్ ల పేరుతో మోడీ నీ దించాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.                

అయోద్యలో జరగనున్న రామ మందిర ప్రాణ ప్రతిష్ట లో తెలంగాణ ప్రజలూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అయోధ్య ఆలయ కార్యక్రమాలకు  బీజేపీకి సంబంధం లేదని.. అది ప్రజలందరికీ సంబంధించినదన్నారు.                                                           

టాప్ హెడ్ లైన్స్

Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget