Breaking News: నీట్-2021 ఫలితాలు విడుదల
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరగనున్న వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు (నవంబర్ 1) ఘనంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్19 నిబంధనలతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 10 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరించనున్నారు. రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తన ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఏపీ గవర్నర్ కార్యాలయంలో కూడా రాష్ట్రవతరణ వేడుకలు జరగనున్నాయి.
ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజు షెడ్యూల్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. నేటి ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ టౌన్ లో నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలెపల్లి గ్రామం వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఉదయం 10.15 నిమిషాలకు ఎర్రమట్టి తండా గ్రామంలోకి పాదయాత్ర చేరుకుంటుంది. బోటిమేడ తండా క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగి 11.00 నిమిషాలకు పాలెం తండా క్రాస్ వద్దకు చేరుకుంటుంది.
చౌలా తండా క్రాస్ మీదుగా కొనసాగిన పాదయాత్ర 11.30 నిమిషాలకు చాకలిషేర్ పల్లి గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఉమ్మపురం క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకోగా.. సాయంత్రం 4.00 గంటలకు గొల్లపల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. 5 గంటలకు సమైక్యానగర్ కు, 5.30 నిమిషాలకు కుర్మేడ్ గేట్కు చేరుకున్న పాదయాత్ర సాయంత్రం 6 గంటలకు అక్కడే ముగుస్తుంది.
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీలు, ఎన్ఐటీలు సహా పలు విద్యాసంస్థల్లో రెండోవిడత సీట్ల కేటాయింపు నేడు జరగనుంది. అక్టోబర్ 27న తొలివిడత సీట్లు కేటాయించగా.. సోమవారం నాడు రెండో విడతలో సీట్లు కేటాయిస్తారు. ఆ విద్యార్థులు నవంబర్ 2 నుంచి 3 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు చెల్లించడం, సర్టిఫికేట్ల అప్లోడింగ్ చేయాలి. నవంబర్ 5లోపు జోసా అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. ఈ సంవత్సరం 6 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24తో మొత్తం సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగియనుంది.
ఎల్పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది
ఎల్పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీ సిలిండర్లపై రూ.266 మేర పెరిగింది. నవంబర్ 1 నుంచే ఇది అమలులోకి రానుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
నీట్ ఫలితాలు విడుదల
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్-యూజీ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల ప్రకటనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు భావించారు. ఎన్టీఏ అధికారులు సోమవారం ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్సైట్లో పొందవచ్చు.
టీఆర్ఎస్ వరంగల్ విజయ గర్జన సభ వాయిదా
టీఆర్ఎస్ వరంగల్ విజయ గర్జన సభ వాయిదా పడింది. నవంబర్ 15న నిర్వహించే విజయ గర్జన సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది. సీఎం కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న దీక్ష దివాస్ సభను నిర్వహించనున్నారు.
నార్సింగ్ ఫామ్ హౌస్ పేకాట కేసు... 30 మంది అరెస్టు, 6.7 లక్షల స్వాధీనం
హైదరాబాద్ శివారులో హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడిన కేసులో 30 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం విల్లా అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. 30 మంది పేకాటరాయుళ్లతో నిర్వాహకుడు పేకాట ఆడిస్తున్న పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 6.7 లక్షల నగదు, 33 సెల్ ఫోన్లు , 3 కార్లు , 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
సమాచార అధికారులకు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే
సీఎస్ ఉత్తర్వులు సమాచార హక్కు చట్టానికి విరుద్ధమని వచ్చిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. సమాచార అధికారులకు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. సమాచారం ఇచ్చే ముందు శాఖాధిపతుల అనుమతి తీసుకోవాలని సూచించింది. సమాచార అధికారులకు అక్టోబర్ 13న సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ సతీష్చంద్ర శర్మ ధర్మాసనం ఆ ఉత్తర్వుల అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఏపీలో మిగతా మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. రాష్ట్రంలో పన్నెండు మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నుల 15వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్ల పరిధిలో 12 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటితో పాటు 12 మున్సిపాలిటీలో మిగిలిపోయిన 13 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతాయి.
విజయ గర్జన సభకు స్థల పరిశీలనకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2 దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా నగరంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పరిశీలించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ అవతరణ దినోత్సవం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగువారికి రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎల్పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది
ఎల్పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీ సిలిండర్లపై రూ.266 మేర పెరిగింది. నవంబర్ 1 నుంచే ఇది అమలులోకి రానుంది.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచే ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్న 2.66 లక్షల మంది వాలంటీర్లు. నవంబర్ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.1417.53 కోట్లు విడుదల చేసిందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 13వ రోజు షెడ్యూల్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. నేటి ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ టౌన్ లో నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలెపల్లి గ్రామం వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఉదయం 10.15 నిమిషాలకు ఎర్రమట్టి తండా గ్రామంలోకి పాదయాత్ర చేరుకుంటుంది. బోటిమేడ తండా క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగి 11.00 నిమిషాలకు పాలెం తండా క్రాస్ వద్దకు చేరుకుంటుంది.
చౌలా తండా క్రాస్ మీదుగా కొనసాగిన పాదయాత్ర 11.30 నిమిషాలకు చాకలిషేర్ పల్లి గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఉమ్మపురం క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకోగా.. సాయంత్రం 4.00 గంటలకు గొల్లపల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. 5 గంటలకు సమైక్యానగర్ కు, 5.30 నిమిషాలకు కుర్మేడ్ గేట్కు చేరుకున్న పాదయాత్ర సాయంత్రం 6 గంటలకు అక్కడే ముగుస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets