అన్వేషించండి

Breaking News: నీట్-2021 ఫలితాలు విడుదల  

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరగనున్న వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News: నీట్-2021 ఫలితాలు విడుదల  

Background

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు (నవంబర్‌ 1) ఘనంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్‌19 నిబంధనలతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 10 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరించనున్నారు. రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తన ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఏపీ గవర్నర్‌ కార్యాలయంలో కూడా రాష్ట్రవతరణ వేడుకలు జరగనున్నాయి. 

ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజు షెడ్యూల్ 
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. నేటి ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ టౌన్ లో నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలెపల్లి గ్రామం వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఉదయం 10.15 నిమిషాలకు ఎర్రమట్టి తండా గ్రామంలోకి పాదయాత్ర చేరుకుంటుంది. బోటిమేడ తండా క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగి 11.00 నిమిషాలకు పాలెం తండా క్రాస్ వద్దకు చేరుకుంటుంది. 

చౌలా తండా క్రాస్ మీదుగా కొనసాగిన పాదయాత్ర 11.30 నిమిషాలకు చాకలిషేర్ పల్లి గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఉమ్మపురం క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకోగా.. సాయంత్రం 4.00 గంటలకు గొల్లపల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. 5 గంటలకు సమైక్యానగర్ కు, 5.30 నిమిషాలకు కుర్మేడ్ గేట్‌కు చేరుకున్న పాదయాత్ర సాయంత్రం 6 గంటలకు అక్కడే ముగుస్తుంది.

జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు విద్యాసంస్థల్లో రెండోవిడత సీట్ల కేటాయింపు నేడు జరగనుంది. అక్టోబర్‌ 27న తొలివిడత సీట్లు కేటాయించగా.. సోమవారం నాడు రెండో విడతలో సీట్లు కేటాయిస్తారు. ఆ విద్యార్థులు నవంబర్‌ 2 నుంచి 3 వరకు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌, ఫీజు చెల్లించడం, సర్టిఫికేట్ల అప్‌లోడింగ్‌ చేయాలి. నవంబర్‌ 5లోపు జోసా అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. ఈ సంవత్సరం 6 విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24తో మొత్తం సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగియనుంది. 

ఎల్​పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది
ఎల్​పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్​పీజీ సిలిండర్లపై రూ.266 మేర పెరిగింది. నవంబర్ 1 నుంచే ఇది అమలులోకి రానుంది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

21:13 PM (IST)  •  01 Nov 2021

నీట్ ఫలితాలు విడుదల  

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్‌-యూజీ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల ప్రకటనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి నీట్‌ ఫలితాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్‌ కీ, పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు భావించారు. ఎన్‌టీఏ అధికారులు సోమవారం ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

 

20:27 PM (IST)  •  01 Nov 2021

టీఆర్ఎస్ వరంగల్ విజయ గర్జన సభ వాయిదా

టీఆర్ఎస్ వరంగల్ విజయ గర్జన సభ వాయిదా పడింది. నవంబర్ 15న నిర్వహించే విజయ గర్జన సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది. సీఎం కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న దీక్ష దివాస్ సభను నిర్వహించనున్నారు.

17:07 PM (IST)  •  01 Nov 2021

నార్సింగ్ ఫామ్ హౌస్ పేకాట కేసు... 30 మంది అరెస్టు, 6.7 లక్షల స్వాధీనం 

హైదరాబాద్ శివారులో హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడిన కేసులో 30 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం విల్లా అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. 30 మంది పేకాటరాయుళ్లతో నిర్వాహకుడు పేకాట ఆడిస్తున్న పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 6.7 లక్షల నగదు, 33 సెల్ ఫోన్లు , 3 కార్లు , 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

15:04 PM (IST)  •  01 Nov 2021

సమాచార అధికారులకు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే

సీఎస్ ఉత్తర్వులు సమాచార హక్కు చట్టానికి విరుద్ధమని వచ్చిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. సమాచార అధికారులకు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. సమాచారం ఇచ్చే ముందు శాఖాధిపతుల అనుమతి తీసుకోవాలని సూచించింది. సమాచార అధికారులకు అక్టోబర్ 13న సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం ఆ ఉత్తర్వుల అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

13:41 PM (IST)  •  01 Nov 2021

ఏపీలో మిగతా మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. రాష్ట్రంలో పన్నెండు మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నుల 15వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్ల పరిధిలో 12 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటితో పాటు 12 మున్సిపాలిటీలో మిగిలిపోయిన 13 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతాయి.

12:29 PM (IST)  •  01 Nov 2021

విజయ గర్జన సభకు స్థల పరిశీలనకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి 2 దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వ‌హించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి, విజ‌య‌వంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా న‌గ‌రంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు ప‌రిశీలించారు. 

10:46 AM (IST)  •  01 Nov 2021

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ అవతరణ దినోత్సవం

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగువారికి రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

09:15 AM (IST)  •  01 Nov 2021

ఎల్​పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది

ఎల్​పీజీ సిలిండర్ల ధర మళ్లీ పెరిగింది. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్​పీజీ సిలిండర్లపై రూ.266 మేర పెరిగింది. నవంబర్ 1 నుంచే ఇది అమలులోకి రానుంది.

08:23 AM (IST)  •  01 Nov 2021

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచే ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్న 2.66 లక్షల మంది వాలంటీర్లు. నవంబర్ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.1417.53 కోట్లు విడుదల చేసిందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

08:17 AM (IST)  •  01 Nov 2021

ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 13వ రోజు షెడ్యూల్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. నేటి ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ టౌన్ లో నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలెపల్లి గ్రామం వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఉదయం 10.15 నిమిషాలకు ఎర్రమట్టి తండా గ్రామంలోకి పాదయాత్ర చేరుకుంటుంది. బోటిమేడ తండా క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగి 11.00 నిమిషాలకు పాలెం తండా క్రాస్ వద్దకు చేరుకుంటుంది. 

చౌలా తండా క్రాస్ మీదుగా కొనసాగిన పాదయాత్ర 11.30 నిమిషాలకు చాకలిషేర్ పల్లి గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఉమ్మపురం క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకోగా.. సాయంత్రం 4.00 గంటలకు గొల్లపల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. 5 గంటలకు సమైక్యానగర్ కు, 5.30 నిమిషాలకు కుర్మేడ్ గేట్‌కు చేరుకున్న పాదయాత్ర సాయంత్రం 6 గంటలకు అక్కడే ముగుస్తుంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Embed widget