అన్వేషించండి

Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Background

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడం దాదాపుగా తగ్గిపోయింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో కొనసాగుతూ సముద్ర మట్టంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. శనివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కుతోంది.

తెలంగాణలో వర్షాలు
రాష్ట్రానికి ఆగస్టు 5 వరకు వర్ష సూచన ఉంది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో  కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. ఉక్కపోత అధికం కానుంది. అయితే కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు చాలా తక్కువగా ఉంది. శనివారం ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నేడు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. ఆగస్టు 5 నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి జల్లులు పడతాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరో రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

22:08 PM (IST)  •  04 Sep 2022

రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  చింతల్ మెట్ చౌరస్తాలోని met square గోదాములో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో గోదాం, పక్కనున్న వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.  శంషాబాద్ జోన్ డీసీపీ, రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

15:03 PM (IST)  •  04 Sep 2022

Salem Court: టీటీడీకి సేలం కోర్టు భారీ జరిమానా

టీటీడీపై తమిళనాడు రాష్ట్రంలోని సేలం కన్జ్యూమర్ కోర్టు సీరియస్ అయ్యింది. తమిళనాడుకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడికి రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం జారీ చేసింది. 2006లో మేల్‌చాట్ వస్త్రం సేవ దర్శనానికి రూ.12,250 రూపాయలు టీటీడీకి చెల్లించినా దాదాపు 17 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంత వరకూ భక్తుడికి మేల్ చాట్ వస్త్రం కేటాయించక పోవడంతో తమిళనాడు భక్తుడు సేలం కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో‌ కోర్టు తాజా తీర్పు వెల్లడించింది.‌

15:01 PM (IST)  •  04 Sep 2022

Asifabad: కుమ్రం భీం జిల్లాలో బఠానీ వినాయకుడు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడ కాలనికి చెందిన యువకులు ప్రతియేటా వినూత్న రీతిలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ సాయి గణేష్ మండల్ ఆద్వర్యంలో గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తువస్తున్నారు. ఈ యేడాది పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ సాయి గణేష్ మండల్ ఆధ్వర్యంలో 25 KG ల బఠానీ విత్తనాలతో వినూత్న రీతిలో వినాయక విగ్రహాన్ని ఎర్పాటు చేశారు. 25kgల బఠానీలతో తయారు చేసిన వినాయక విగ్రహాం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ బఠానీ వినాయకుణ్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు. బఠానీలతో విగ్రహం ఏర్పాటు చేసిన కళాకారులను అభినందిస్తున్నారు. ప్రతియేటా వివిధ కళా రూపాలతో వినూత్న రీతిలో భక్తులను ఆకట్టుకునేలా వినాయక విగ్రహలను ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని స్తానిక యువకుడు జయచందర్ తెలుపుతున్నాడు. 

14:19 PM (IST)  •  04 Sep 2022

VRA Suicide: కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్య, ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత

ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారంలో ఉరేసుకుని వీఆర్ఏ అశోక్ ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో వీఆర్ఏ అశోక్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ వీఆర్ఏల పేస్కేల్ కోసం పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. దీంతో అశోక్ మృతదేహంతో వీఆర్ఏలు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వీఆర్ఏలకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతు  తెలిపారు. మృతదేహంతో రోడ్డుపై కుటుంబ సభ్యులు, వీఆర్ఏలు ధర్నాకు దిగి నిరనసన తెలుపుతున్నారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వీఆర్ఏల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బొల్లారంలో భారీగా పోలీసులు మోహరించారు.

11:41 AM (IST)  •  04 Sep 2022

Chiranjeevi: రాజ్ భవన్ కు మెగాస్టార్ చిరంజీవి, వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ

నటుడు చిరంజీవి తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 50 సార్ల కంటే ఎక్కువ సార్లు రక్త దానం చేసిన వారికి ‘చిరు భద్రత’ పేరుతో గవర్నర్ చేతుల మీదుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా తాము 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు. ఇందులో 70 శాతం రక్తం పేదలకు అందించామని చెప్పారు. మిగతా ప్రైవేటు ఆస్పత్రులకు అందజేశామని వివరించారు.

10:31 AM (IST)  •  04 Sep 2022

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ రోడ్లపైకి ఎలుగుబంటి

శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ ఎలుగుబంటి హల్ చల్ చేస్తోంది. నిశ్శబ్దంగా అందరూ పడుకునే సమయానికి ఒక్కసారిగా వీధుల్లోకి రావడంతో పిల్లలు పెద్దలు కేకలు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఎలుగుబంటి వీధిలోకి వచ్చిందంటూ ఒక పక్కన పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరో పక్కన భయపడుతున్నారు. మందస మండలం దున్నవూరు పంచాయతీ మొగిలిపాడు గ్రామంలో ఎలుగుబంటిని చూసి చిన్నా, పెద్ద కూడా దాని తరిమి కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

10:29 AM (IST)  •  04 Sep 2022

Congress Protests: రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా, ఢిల్లీకి చేరిన రాహుల్ గాంధీ

దేశంలో అధిక ధరలు, జీఎస్టీ, నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ కదిలింది. అందుకోసం ఢిల్లీలో మైదానంలో మహాధర్నా చేపడుతోంది, రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నిరసనల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget