అన్వేషించండి

Breaking News Live Telugu Updates: బీజేపీ ఎమ్మెల్యే రజాసింగ్ కు కరోనా పాజిటివ్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: బీజేపీ ఎమ్మెల్యే రజాసింగ్ కు కరోనా పాజిటివ్ 

Background

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలో్ సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.6 కిలోమీటర్ల మధ్య తుఫాను తక్కువ ప్రభావం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు గుజరాత్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్ గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్ లోకి జూన్ 19న ప్రవేశించాయని పేర్కొంది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వాయువ్య బంగాళాఖాతం, ఛత్తీస్ గఢ్, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, ఈశాన్య ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగే పరిస్థితులు ఉన్నాయి. కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడింది. నేడు యానాంతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయవాడ​, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో విస్తరిస్తున్న భారీ వర్షాలు నేరుగా కడప జిల్లాలొకి విస్తరించనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. 

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోనూ నేడు సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నిన్న సైతం రాష్ట్రంలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

19:33 PM (IST)  •  20 Jun 2022

బీజేపీ ఎమ్మెల్యే రజాసింగ్ కు కరోనా పాజిటివ్ 

గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ కు కరోనా సోకింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో సోమవారం యూపీహెచ్సీ కార్వాన్లో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇటీవల తనను కలిసిన వారిని కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు

16:14 PM (IST)  •  20 Jun 2022

సీఎం కేసీఆర్ సతీమణికి స్వల్ప అస్వస్థత! 

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో ఆమె జాయిన్ అయ్యారు. ఆమె స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.  ఆమెకు మోకాలికి  యశోద ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. 

14:32 PM (IST)  •  20 Jun 2022

Srikakulam Bear Attacks: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో మరోసారి ఎలుగుబంటి దాడి

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో మరోసారి ఎలుగుబంటి దాడి
ఏడుగురికి  తీవ్రగాయాలు
పలాస ప్రభుత్వాసుపత్రికి తరలింపు , ఆరుగురి పరిస్థితి విషమం
వరుసగా సంభవిస్తున్న ఘటనలు. అటవీ అధికారుల నిర్లక్ష్యం అంటూ స్దానికులు ఆవేదన.
పొలం పనులు వెళ్లాలన్నా. ఇంట్లో నుంచి బయటికి రావాలి అన్న అని భయంగా ఉంది అంటూ ఆందోళన
ఎలుగుబంటి ని చూసి పరుగులు తీస్తున్న గ్రామస్తులు
నిన్న సైతం ఎలుగుబంటి దాడిలో కోదండరాం అనే రైతు మృతి

13:01 PM (IST)  •  20 Jun 2022

Chalo Narsipatnam: విశాఖపట్నం జిల్లాలోనూ టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

‘చలో నర్సీపట్నం’కు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే తెలుగు దేశం నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అనకాపల్లిలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావును గృహ నిర్బంధం చేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర బీసీ కన్వీనర్ మళ్ల సురేంద్ర నర్సీపట్నం వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

12:20 PM (IST)  •  20 Jun 2022

Dhuliaplla Nnarendra Arrested: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీడీపీ నేతలు తలపెట్టిన చలో అనుమర్లపూడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని అనుమవర్లపూడి చెరువు వద్దకు చేరుకున్న టీడీపీ సీనియర్ నేతల ధూళిపాల్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది.

12:02 PM (IST)  •  20 Jun 2022

AP CM Camp Office: క్యాంప్ ఆఫీసుకు వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మంత్రి పెద్దిరెడ్డి

క్యాంప్‌ కార్యాలయానికి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీా ఈవో ధర్మారెడ్డి వెళ్లారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీ వకుళమాత ఆలయం(పేరూరు, తిరుపతి) ప్రారంభోత్సవానికి ఆహ్వనించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి. ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు.

11:36 AM (IST)  •  20 Jun 2022

Bhatat Bandh: నెల్లూరు జిల్లాలో పోలీసులు అలెర్ట్, పలు జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు

అగ్నిపథ్ స్కీమ్ పై భారత్ బంద్‌కు ప్రజా సంగాలు, ఆర్మీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పిలుపునివ్వడంతో నెల్లూరు జిల్లాలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈరోజు భారత్ బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ముమ్మరం చేశారు. కావలి పట్టణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలతో  బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసు శాఖ. పట్టణంలోని పలు సెంటర్లలో పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు ముందస్తు చర్యలు చేపట్టారు. 
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా పలు రాజకీయ్య పార్టీలు ఆర్మీ అభ్యర్థులు నిరుద్యోగ యువత భారత్ బంద్ కు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు పట్టణంలో అదనపు బలగాలతో పోలీసు శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కావలి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. 

09:16 AM (IST)  •  20 Jun 2022

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హై అలర్ట్

అగ్ని పథ్‌కు నిరసనగా భారత్ బంద్‌ కు ఆర్మీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. అగ్నిపథ్‌ను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలెర్ట్ ప్రకటించాయి. ఈ నెల 17న జరిగిన ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజాసంఘాలు, అభ్యర్థులు ఎవరూ రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.

09:13 AM (IST)  •  20 Jun 2022

Tirumala Updates: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో బిజేపి ఎమ్మెల్సీ మాధవ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసుడి ఆశీస్సులతో ఏపి రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా సకాలంలో వర్షాలు కురిసి త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారన్నారు.. తిరుమలలో టిటిడి పాలక మండలి, ఈవోలు భక్తులు ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయడం సంతోషకరంమని, ఇదే విధంగా భవిష్యత్తులో ముక్కోటి దేవలు ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రార్ధించినట్లు ఎంపీ రెడ్డప్ప తెలిపారు..

08:24 AM (IST)  •  20 Jun 2022

Venkaiah Naidu: నేడు హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి - ఇవాళ, రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు హైదరాబాద్ కి వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. నేడు సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఉప రాష్ట్రపతి బయలుదేరి పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లై ఓవర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు ద్వారా రోడ్‌ నెంబర్‌ 29లోని నివాసానికి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 6.20 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌, ప్రకాశ్‌నగర్‌ ఫ్లైఓవర్‌, రసూల్‌పురా సీటీఓ మీదుగా పరేడ్‌ గ్రౌండ్‌ చేరుకుంటారు.7.30 గంటలకు కార్యక్రమం ముగిసిన తర్వాత పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లై ఓవర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మార్గం ద్వారా ఆయన ఇంటికి చేరుకుంటారు. యోగా కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హాజరవుతున్నందున పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని రంగనాథ్‌ తెలిపారు. తిరుమలగిరి, బోయిన్‌పల్లి, టివోలి క్రాస్‌రోడ్స్‌, సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌, బేగంపేట్‌, ప్యారడైజ్‌, జేబీఎస్‌, కార్ఖానా, వైఎంసీఏ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలతోపాటు మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget