అన్వేషించండి

Phone Tapping Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు మూలం ట్యాపింగ్ - రాధాకిషన్ రావు నేతృత్వంలోనే జరిగిందా ?

Telangana News : ట్యాపింగ్ కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు మూలం ట్యాపింగేనని రాధాకిషన్ రావు చెప్పినట్లగా తెలుస్తోంది.

Tapping Case Updates :  మునుగోడు ఉపఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో హైదరాబాద్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు వ్యక్తులను అరెస్టు చేసిన కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగేనని కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది.   ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రావు గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేశారు. వారు  బీజేపీ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలియగానే..  ప్రణీత్ రావు ప్రభుత్వ పెద్దలకు తెలియచేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత రాధాకిషన్ రావుతో కలిసి స్పెషల్ ఆపరేషన్ కు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. 

నందకుమార్ తో పాటు స్వామిజీని .. అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు పిలిపించారు. అంతకు ముందే ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ హైకమాండ్ ఈ అంశంపై మాట్లాడింది. బేరాల గురించి మొత్తం తెలిసిపోయిందని.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు సహకరించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే  టిక్కెట్లు ఆఫర్ చేయడంతో వారు అంగీకరించిటన్లుగాతెలుస్తోంది. రోహిత్ రెడ్డికి తెలిసే ఆయన ఫామ్ హౌస్‌లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాప్  కెమెరాలను రాధాకిషన్ రావు అండ్ కో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చివరికి అనుకున్నట్లుగా ట్రాప్ చేశారు. పట్టుకున్నారు. ఈ కేసు సంచలనం అయింది. 

ఈ కేసులో ఎమ్మెల్యేలతో బేరాలాడి పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేరళకు చెందిన తుషార్ తో పాటు బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో వీరిద్దరిని అరెస్టు  చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు.  ఈ కేసు విచారణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందం నోటీసులు ఇవ్వడానికి ప్రత్యేక విమానాల్లో వెళ్లింది.  విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం కామనే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్ నేతకు చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లారు. బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇవ్వడానికి స్పెషల్ ఫ్లైట్ ను వీరు వినియోగించారు. ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారు అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

ఈ కేసు బయటపడిన తర్వాత చాలా రోజుల పాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలు  కేసీఆర్ వెంటనే ఉన్నారు.  ఫామ్ హౌస్ లోనే నెల రోజుల పాటు ఉన్నారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ.. కోర్టు నిర్ణయం తీసుకుంది. సీఎంగా ఉన్న కేసీఆర్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారని. అవి ఎలా లీక్ అయ్యాయో తేలాల్సి ఉందన్నారు. అయితే సీబీఐకి ఈ కేసును అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్టే ఆదేశాలు లేకపోయినప్పటికీ.. సీబీఐ విచారణ ప్రారంభించలేదు. ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.  తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Embed widget