అన్వేషించండి

Breaking News Live: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్షసూచన

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్షసూచన

Background

కరీంనగర్ జిల్లా మానకొండూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కారు ఏకంగా చెట్టును ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారు హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కవిత ప్రత్యేక పూజలు
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలో సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌ గుప్తా పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఆలయ సిబ్బంది, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

పాతబస్తీలో దారుణం
హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌ బ‌స్తీలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఓ బాబా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన త‌ల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్దరు యువతులు.. పాత‌బ‌స్తీలోని ఓ బాబాను ఆశ్రయించారు. త‌ల్లికి వైద్యం చేస్తూనే ఆమె కూతుర్లపై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. వీరిలో ఒక‌రికి పెళ్లి కాగా, ఆమెకు విడాకులు కూడా ఇప్పించి దారుణాల‌కు పాల్పడ్డాడు. ఆ వివాహిత‌పై బాబా కుమారుడు కూడా అత్యాచారం చేశాడు. అక్కాచెల్లెళ్లను మాన‌సికంగా, శారీర‌కంగా వేధించ‌డ‌మే కాకుండా, ఆర్థికంగా కూడా కుంగ‌దీశాడు. బాధిత యువ‌తుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాబాతో పాటు అత‌ని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నాలుగు రోజులుగా స్థిరమైన ధరలే ఉంటున్నాయి. కానీ, తాజాగా స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గి రూ.107.69 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు తగ్గి రూ.94.14 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువగానే పెరిగింది. లీటరుకు రూ.0.31 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.67 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.26 పైసలు పెరిగి రూ.96.74గా ఉంది.

బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. వరుసగా రెండు రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన ధరలు తాజాగా నిలకడగా ఉన్నాయి. వెండి ధర కిలోకు రూ.200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,800గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 

19:37 PM (IST)  •  26 Nov 2021

చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షసూచన

చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన చేసింది. తిరుపతి, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 29 అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

18:19 PM (IST)  •  26 Nov 2021

నల్లజర్లలో సారాయి తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు

పశ్చిమ గోదావరి జిల్లా నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు చేశారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామ శివారులలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మూడు సారాయి తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. 13 డ్రమ్ములలో ఉన్న బెల్లం ఊట ధ్వంసం చేసి, మూడు గ్యాస్ సిలిండర్ లు,  అల్యూమినియం సామాగ్రిని,  ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. 25 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 

17:38 PM (IST)  •  26 Nov 2021

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 18న ప్రారంభమైన సమావేశాలు ఇవాళ్టి వరకూ జరిగాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు సభలు ఆమోదం తెలిపాయి.  

16:47 PM (IST)  •  26 Nov 2021

రైలులో అగ్ని ప్రమాదం..

దిల్లీ-ఛత్తీస్‌గఢ్ రైలులో నాలుగు కోచ్‌లలలో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ మెరేనా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

16:22 PM (IST)  •  26 Nov 2021

ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రం అందుకున్న కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు  ధృవీకరణ పత్రాన్ని కవిత అందించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్  ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొ్న్నారు. 

 

14:57 PM (IST)  •  26 Nov 2021

శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై స్పందించిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు

శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులు కరోనాతో పోరాడుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యంపై ఆరా తీశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరాను. శివశంకర్ మాస్టర్‌ చిన్న కుమారుడు అజయ్‌‌ను ఫోన్‌లో సంప్రదించాను. శివశంకర్ మాస్టర్‌తో పాటు కుటుంబసభ్యులు త్వరగా కోలుకోవాలని’ మంచు విష్ణు ఆకాంక్షించారు.

13:22 PM (IST)  •  26 Nov 2021

ఏపీలో వర్షాలు, వరదలపై అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన

ఏపీలో వర్షాలు, వరదలపై అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. ‘కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుమల మాడవీధుల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. గడిచిన వందేళ్లలో ఇలాంటి వర్షాలు ఎప్పుడూ పడలేదు. మూడు రెట్లు వరద ఎక్కువగా వచ్చింది. రెండు, మూడు గంటల్లోనే వరద విరుచుకు పడింది. పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల దిగువనే ఎక్కువ నష్టం వాటిల్లింది. పింఛ రిజర్వాయర్ సామర్థ్యం 0.32 టీఎంసీలు మాత్రమే. పింఛలో లక్షా 38 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

13:12 PM (IST)  •  26 Nov 2021

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌‌గా జకియా ఖానమ్‌

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌‌గా జకియా ఖానమ్‌ ఎన్నికయ్యారు. తొలిసారి మైనారిటీ మహిళ ఈ పదవి దక్కించుకున్నారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం ఎన్నిక నిర్వహించగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. మైనారిటీలపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

12:55 PM (IST)  •  26 Nov 2021

కడప కలెక్టర్ తక్షణం స్పందిస్తే.. ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదన్న శైలజానాథ్

తుపాను వల్ల రాజంపేట నందలూరులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పించా డ్యామ్ తెగిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించి ఉంటే ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కూర్చుని పనులను పర్యవేక్షించడం హేయనీయం.. గతంలో పలు ప్రభుత్వాలు ఇలాంటి విపత్తులను ధీటుగా ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందంటూ కొంత మంది మంత్రులు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి వెలకట్టలేమన్నారు.

12:42 PM (IST)  •  26 Nov 2021

జగిత్యాలలో రైతు ర్యాలీ, మహా ధర్నా ప్రారంభం

జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతు ర్యాలీ, మహా ధర్నా ప్రారంభమైంది. పండించిన పంటలను ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాలలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు రైతుల పాదయాత్ర సాగింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిKiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Embed widget