అన్వేషించండి

Reservation For BCs: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమే - జస్టిస్ ఈశ్వరయ్య

BC Reservation in Local Body Elections | ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య తెలిపారు.

Reservation For BCs in local body elections | హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య (Justice Eshwaraiah) అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యనేతలు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జస్టిస్ వి ఈశ్వరయ్యతో సోమవారం నాడు (సెప్టెంబర్ 23న) సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల, సమగ్ర కులగణన (Caste Sensus), న్యాయపరమైన అంశాలను చర్చించారు. 

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే

రిజర్వేషన్ల పెంపు కచ్చితంగా సాధ్యమేనని, అయితే అది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉందని జస్టిస్ ఈశ్వరయ్య వివరించారు. ఎక్కడైనా సరే ప్రభుత్వాలకు ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే రిజర్వేషన్ల పెంపు సహా ఇతర అంశాలు అమలు సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికల మేనిఫేస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సమగ్ర కుల గణన (Caste Sensus) చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ల కల్పించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు ఆ పార్టీ నేతలు. ఆ దిశకు యువతను, రాష్ట్ర ప్రజలను చైతన్య వంతులను చేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. 

జస్టిస్ ఈశ్వరయ్యతో భేటీ అయి చర్చించిన వారిలో ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీలు వి గంగాధర్ గౌడ్, కర్నె ప్రభాకర్, సీనియర్ నేత చెరుకు సుధాకర్, మాజీ చైర్మన్లు పల్లె రవి కుమార్ గౌడ్, డాక్టర్ చిరుమల్ల రాకేశ్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, జి నాగేందర్ గౌడ్, బీసీ కమీషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్ర చారి, శుభప్రద్ పటేల్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, నోముల భగత్, మాజీ కార్పొరేటర్ అలకుంటృహరి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్, కార్యదర్శి మన్నె రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

చాలా రోజుల కిందటే ముగిసిన పంచాయతీల పదవీ కాలం

తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం చాలాకాలం కిందటే ముగిసింది. ఇప్పటికే ఏడు, 8 నెలలు కావస్తున్నా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. అయితే బీసీ కుల గణన చేపట్టి అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారా అని చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ వచ్చాక ఎన్నికల నిర్వహణ చేపడితే ఏ సమస్యా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ చివరి వారంలో, లేకపోతే నవంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

Also Read: Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget