Whatsapp: కొత్త ఫీచర్ను తీసుకువచ్చిన వాట్సాప్ - ఇక ఒకే గ్రూపులో!
వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్యను 256 నుంచి 512కు పెంచింది. ఈ ఫీచర్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్ ఇటీవలే కొన్ని కొత్త ఫీచర్లపై పనిచేస్తుంది. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులో ఎక్కువ మందిని యాడ్ చేసే ఫీచర్ను తీసుకువచ్చారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా 512 మందిని ఒకే గ్రూపులో యాడ్ చేయవచ్చు. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులో 256 మందిని మాత్రమే యాడ్ చేసే అవకాశం ఉంది.
అయితే మార్కెట్లో ఉన్న మిగతా మెసేజింగ్ యాప్స్ ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసుకునే ఫీచర్లను కూడా అందించాయి. ఉదాహరణకు టెలిగ్రాం యాప్ను తీసుకుంటే అందులో ఏకంగా 2 లక్షల మందిని వరకు యాడ్ చేసే అవకాశం ఉంది. వాట్సాప్ గ్రూపు సైజ్ను 512 మందికి పెంచినా టెలిగ్రాం గ్రూప్ కెపాసిటీ దగ్గరకు కూడా రాలేదు.
వాట్సాప్ గ్రూపు సభ్యుల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు మెటా గత నెలలోనే ప్రకటించింది. WABetainfo కథనం ప్రకారం ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్ టాప్ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త ఫీచర్ మీకు వచ్చిందో రాలేదో తెలుసుకోవడం కోసం మీ వాట్సాప్ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు గ్రూపులో 512 మందిని యాడ్ చేయగలిగితే మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లే.
Also Read: వన్ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
Before You Go
Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















