అన్వేషించండి

Elon Musk: వాట్సాప్‌ను నమ్మలేం, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ టార్గెట్ చేశారు. వాట్సాప్ ను నమ్మలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లోనూ వాట్సాప్ లాంటి ఫీచర్లు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ ను సొంతం చేసుకున్న నాటి నుంచి ఎలన్ మస్క్ తీసుకునే నిర్ణయాలు పెను సంచలనానికి కారణం అవుతున్నాయి. ఇప్పటి వరకు ట్విట్టర్ లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన ఆయన, తొలిసారి ప్రత్యర్థి సంస్థలను టార్గెట్ చేశారు. ఏకంగా వాట్సాప్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. వాట్సాప్ ను విశ్వసించలేమంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మస్క్ వ్యాఖ్యలు వాట్సాప్ కు తీవ్ర తలనొప్పులు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

వివాదంలో వాట్సాప్

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో వాట్సాప్ ముందుంటుంది. మెసేజెస్, వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్ సహా పలు రకాల అవసరాల కోసం వినియోగదారులు ఈ యాప్ ను వినియోగిస్తారు. అయితే, వాట్సాప్ సెక్యూరిటీ విషయంలో ఎప్పటికప్పుడు అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్ వాట్సాప్‌ సెక్యూరిటీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ లిస్టులో ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ చేరారు. వాట్సాప్‌ ను నమ్మలేమంటూ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.  

ఇంతకీ ఏం జరిగిందంటే?

తాను నిద్రిస్తున్నప్పుడు కూడా వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో తన మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని ట్విట్టర్ ఇంజనీర్  ఫోడ్ డబిరి ఆరోపించారు.  తన వాదనలకు మద్దతుగా ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు.  ఇందులో అతడి WhatsApp మైక్రోఫోన్‌ను  ఉదయం 4:20 నుంచి 6:53 వరకు యాక్సెస్ చేసినట్లు కనిపిస్తోంది. "నేను నిద్రపోతున్నప్పుడు, నేను లేచినప్పుడు కూడా వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోంది.ఏమి జరుగుతోంది?" అంటూ ట్వీట్ చేశారు.

ఫోడ్ డబిరి ఆరోపణలపై వాట్సాప్ వివరణ

డబిరి ఆరోపణలపై వాట్సాప్ వివరణ ఇచ్చింది. ఆండ్రాయిడ్‌లో  తమ గోప్యతా డాష్‌బోర్డ్‌ లో సమాచారాన్ని తప్పుగా ఆపాదించే  బగ్ కారణంగా సమస్య తలెత్తుతుందని వివరించింది. వినియోగదారుడి దగ్గర ఉన్న ఫోన్ గూగుల్ పిక్సెల్ అని,  ఈ విషయాన్ని పరిశోధించి, పరిష్కారాన్ని అందించమని గూగుల్‌ను కోరినట్లు వెల్లడించింది. మరో ట్వీట్‌లో, WhatsApp  వినియోగదారులకు వారి మైక్రోఫోన్ సెట్టింగ్‌లపై  పూర్తి నియంత్రణ  ఉందని వివరించింది. వినియోగదారు కాల్ చేస్తున్నప్పుడు, వాయిస్ నోట్,  వీడియోని రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే మైక్‌ని యాక్సెస్ చేయగలరని పేర్కొంది.

వాట్సాప్ ను నమ్మలేం, వాట్సాప్ లాంటి ఫీచర్లను ట్విట్టర్‌లో తెస్తున్నాం- మస్క్

అటు తమ కంపెనీ ఉద్యోగి చేసిన ట్వీట్ పూ మస్క్ రీట్వీట్ చేశారు. వాట్సాప్‌ నమ్మదగినది కాదంటూ సంచల  స్టేట్ మెంట్ పాస్ చేశారు. మస్క్‌ ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది.   ఆయన ట్వీట్‌ కచ్చితంగా వాట్సాప్‌ కు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  సంస్థ తీరని నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.  అటు మరో సంచలన ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో వాట్సాప్ లాంటి ఫీచర్లను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.  వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చని తెలిపారు.    

Read Also: ఇకపై మీ చాట్ లాక్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Indian Cricketer Dies: వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
Operation Safed Sagar Web Series : సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
Advertisement

వీడియోలు

India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Indian Cricketer Dies: వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు విషాదం! రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి
Operation Safed Sagar Web Series : సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 55 రివ్యూ... కత్తులు పొడిచి కళ్ళు తెరిపించిన నాగ్... దువ్వాడ మాధురితో పాటు ఆ ముగ్గురికీ దిమ్మతిరిగే కౌంటర్... లాస్ట్‌లో పొట్టపగిలే కామెడీ ట్విస్ట్
బిగ్‌బాస్ డే 55 రివ్యూ... కత్తులు పొడిచి కళ్ళు తెరిపించిన నాగ్... దువ్వాడ మాధురితో పాటు ఆ ముగ్గురికీ దిమ్మతిరిగే కౌంటర్... లాస్ట్‌లో పొట్టపగిలే కామెడీ ట్విస్ట్
Prasanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి - ఫిలిం చాంబర్‌లో 'హనుమాన్' ప్రొడ్యూసర్ కంప్లైంట్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి - ఫిలిం చాంబర్‌లో 'హనుమాన్' ప్రొడ్యూసర్ కంప్లైంట్
Embed widget