అన్వేషించండి

UIDAI Alert: మీ ఆధార్ వివరాలను WhatsApp, Gmail ద్వారా పంచుకుంటున్నారా? అయితే, ఈ ముప్పు తప్పదు!

ఆధార్ స్కామ్ కు సంబంధించి UIDAI కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ వివరాలను WhatsApp, ఇమెయిల్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇతరులతో పంచుకోవద్దని వెల్లడించింది.

ధార్ కార్డుల స్కామ్‌కు సంబంధించి UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక హెచ్చరిక జారీ చేసింది. వ్యక్తులు తమ ఆధార్ వివరాలను WhatsApp, ఇమెయిల్ లాంటి ప్లాట్‌ ఫారమ్‌ల ద్వారా పొందేందుకు కొంత మంది సైబర్ కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆధార్ వివరాలను పంచుకోవడం ద్వారా ఏ ఇబ్బంది ఉండదు అని భావిస్తున్నా, మున్ముందు తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పింది.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ వివరాలను పరిచయం లేని వ్యక్తులతో పంచుకోవద్దని తేల్చి చెప్పింది. 

కొద్ది రోజులుగా పెరిగిపోతున్న ఎమర్జింగ్ ఆధార్ స్కామ్స్

ఈ కొత్త స్కామ్‌లో, వ్యక్తులు తమ ఆధార్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకునేలా ఒప్పిస్తున్నారని UIDAI తెలిపింది. అందులో భాగంగానే వినియోగదారులు తమ ఆధార్ కార్డ్ వివరాలను WhatsApp లేదంటే Gmail లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షేర్ చేయమని అడుగుతున్నట్లు వివరించింది.  చాలా మంది వారు చెప్పినట్లుగానే ఆధార్ వివరాలను పంపిస్తూ ఎమర్జింగ్ ఆధార్ స్కామ్ కు గురవుతున్నారని వెల్లడించింది.  రాబోయే ఇబ్బందులను గమనించకుండా సున్నితమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకుంటున్నారని తెలిపింది. 

కీలక హెచ్చరిక జారీ చేసిన UIDAI  

ఆధార్ కార్డ్ అప్‌డేట్‌  కోసం జిమెయిల్, వాట్సాప్ సహా ఇత  ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారి ఆధార్ వివరాలను ఎప్పుడూ కోరదని UIDA తేల్చి చెప్పింది. మీ ఆధార్ కార్డ్‌ ని అప్‌డేట్ చేయడానికి పాటించాల్సిన పద్దతులు అధికారిక UIDAI వెబ్‌సైట్‌లో పొందిపరచ్చినట్లు వెల్లడించింది. ఈ సైట్ లో అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్‌లను సురక్షితంగా సమర్పించవచ్చని తెలిపింది. 

ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం ఏం చేయాలంటే?   

ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ పద్ధతితో పాటు, వినియోగదారులు నేరుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాలని UIDAI సూచించింది. అక్కడి సిబ్బంది అడిగిన డాక్యుమెంట్లను అందజేసి తమ ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది.  ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లో ఎలాంటి మోసాలకు తావు ఉండదని తెలిపింది.

స్కామర్లతో జాగ్రత్తగా ఉండాలి

ఆధార్ అప్ డేట్ పేరుతో స్కామర్లు సున్నిత సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించినా, వారితో జాగ్రత్తగా ఉండాలని UIDAI సూచించింది. అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ వివరాలను అందజేయ కూడదని వెల్లడించింది. అనుమానాస్పద ఫ్లాట్ ఫారమ్ లలో ఆధార్, బ్యాంకింగ్ వివరాలను చెప్పకూడదని సూచించింది. వ్యక్తిగత సమాచారం ఇచ్చే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమాత్రం అనుమానం కలిగినా,  సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది.  UIDAI వెల్లడించిన వివరాలను జాగ్రత్తగా పాటించాలన్నది.  వ్యక్తిగత సమాచారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని,  ఆధార్ కార్డ్ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని తెలిపింది. స్కామర్ల సున్నితమైన సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని వెల్లడించింది.    

Read Also: ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యాడ్‌ను క్లిక్ చేసిన మహిళ - లక్షల రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు? మీకూ ఇలా జరగొచ్చు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget