అన్వేషించండి

Reliance Jio Laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేది అప్పుడే - తక్కువ ధర, ఎక్కువ ఫీచర్స్, కానీ..

టెక్ లవర్స్ ఎంతో ఎదురుచూస్తున్న జియో ల్యాప్ టాప్ ను రిలయన్స్ కంపెనీ విడుదల చేసింది. జియో బుక్ పేరుతో జీఈఎం పోర్టల్ లో అమ్మకానికి పెట్టింది. దీని ఆఫర్ ధరను రూ. 19,500గా నిర్ణయించింది.

రిలయన్స్ జియో తన తొలి ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. జియో బుక్ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ప్రస్తుతం  గవర్నమెంట్‌ ఇ మార్కెట్‌ (GeM) పోర్టల్‌ లో అమ్మాకానికి ఉంచింది. ఈ ల్యాప్ టాప్ ఆఫర్ ధరను  రూ.19,500గా కంపెనీ ఫిక్స్ చేసింది. ప్రస్తుతం ఈ ల్యాప్ టాప్ జీఈఎం పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉండటంతో అందరూ కొనుగోలు చేసే అవకాశం లేదు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగాలు మాత్రమే ఈ ల్యాప్ టాప్ ను కొనే ఛాన్స్ ఉన్నది. దీపావళి పండుగ నాటికి ఈ జియో ల్యాప్ టాప్ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది. అయితే, కమర్షియల్ రేటు ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తొలిసారి జియో బుక్ ను ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌- 2022 ఈవెంట్ లో ప్రదర్శించారు.

జియో బుక్ ఫీచర్లు

⦿ జియో బుక్ 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది.

⦿ 1366X767 పిక్సెల్స్‌  రిజల్యూషన్‌ తో పాటు  క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 665 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ తో వచ్చింది. 

⦿ జియోఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పై ఈ ల్యాప్ టాప్ రన్ అవుతుంది.

⦿ 2 జీబీ ర్యామ్‌ మాత్రమే ఉంది. ర్యామ్ ను పెంచుకునే అవకాశం లేదు.

⦿ యూఎస్‌బీ 2.0 పోర్ట్‌, 3.0 పోర్ట్‌, హెచ్‌డీఎంఐ పోర్టులను కలిగి ఉంది. 

⦿ యూఎస్‌బీ టైప్‌ సి పోర్టులను ఇందులో ఏర్పాటు చేయలేదు.

⦿ మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ ను మాత్రం అందిస్తుంది.

⦿ ఇక బ్లూటూత్‌, 4జీ మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్టివిటీకి అవకాశం ఉంది. 

⦿ రెండు ఇంటర్నల్‌ స్పీకర్లతో పాటు మైక్రో ఫోన్లను కలిగి ఉంది.

⦿ 55.1- 60 ఏహెచ్‌ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది.

⦿ జియో బుక్ బరువు 1.2 కిలోలు ఉంటుంది.

⦿ ఏడాది పాటు బ్రాండ్ వ్యారెంటీని అందిస్తుంది కంపెనీ.   

ఎవరికి ఉపయోగకరం?

వాస్తవానికి ఇందులో వాడిన ప్రాసెసర్ లేటెస్ట్ ది కాదు. గేమ్స్ బాగా ఆడే వారిని ఈ జియో బుక్ పెద్దగా ఆకట్టుకోదని చెప్పుకోవచ్చు. జియో కూడా ఈ ల్యాప్ టాప్ ను గేమర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకురాలేదు. ఈ ధర, ఫీచర్లను గమనిస్తే విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడేలా ఉంది. అటు తొలిసారి ల్యాప్ టాప్ వినియోగించాలని అనుకునే వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ సాధారణ వర్క్ చేసుకోవడానికి సహకరిస్తుంది. హెవీ వర్క్ చేసే వారికి అంతగా ఉపయోగపడదని చెప్పుకోవచ్చు.    

జియో 5జీ సేవలు ప్రారంభం

అటు 5జీ నెట్వర్క్ సేవలపై ఇప్పటికే జియో క్లారిటీ ఇచ్చింది.  దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు నగరాల్లో 5జీ బీటా ట్రయల్‌ సేవలను ఆరంభిస్తున్నామని ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఈ సేవలను ఎంపిక చేసిన కస్టమర్లు సేవలు పొందచ్చని వెల్లడించింది. ఇతర నగరాల్లో కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget