అన్వేషించండి

iPhone SE 3: రూ.22 వేలలోనే ఐఫోన్, వచ్చే నెలలోనే లాంచ్?

టెక్ దిగ్గజం యాపిల్ తన బడ్జెట్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అదే ఐఫోన్ ఎస్ఈ 3.

ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5జీ ఫీచర్ కూడా ఉండనుంది. గతంలో వచ్చిన ఐఫోన్ ఎస్ఈ (2020)కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 8వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ కథనంలో పేర్కొన్నారు. అదేరోజు కొత్త ఐప్యాడ్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.

ఈ కథనం ప్రకారం.. కొత్త ఐఫోన్ ఎస్ఈలో 5జీ కనెక్టివిటీ ఉండనుంది. దీంతోపాటు మెరుగైన కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్ కూడా ఇందులో అందించనున్నారు. త్వరలో యాపిల్ రెండు కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఇందులో మరింత శక్తివంతమైన ప్రాసెసర్లను యాపిల్ అందించనుంది.

ఈ విషయమై యాపిల్ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్‌సెట్ల కొరత నెలకొంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒకవేళ ఈ ఫోన్ లాంచ్ అయినా... ఈ కొరత కారణంగా సేల్‌కు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.

ఏ2595, ఏ2783, ఏ2784 మోడల్ నంబర్లతో మూడు ఐఫోన్లు, ఏ2588, ఏ2589 మోడల్ నంబర్లతో రెండు కొత్త ఐప్యాడ్లు లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ ధర 300 డాలర్ల రేంజ్‌లో (రూ.22,500), ట్యాబ్లెట్ల ధర 500 డాలర్ల (సుమారు రూ.37,400) నుంచి 700 డాలర్ల (సుమారు రూ.52,400) మధ్యలో ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్ ఎస్ఈ 3 డిజైన్ ఇంతకు ముందు లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ (2020) తరహాలోనే ఉండనుందని తెలుస్తోంది. అయితే ఇందులో 5జీ కనెక్టివిటీ, యాపిల్ ఏ15 బయోనిక్ చిప్, 3 జీబీ ర్యామ్ కూడా యాపిల్ అందించనున్నారని వార్తలు వస్తున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AppleDsign (@appledsign)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget