అన్వేషించండి

Womens IPL Media Rights: విమెన్స్‌ ఐపీఎల్‌ - ఒక్కో మ్యాచుకు రూ.7 కోట్లు ఇస్తున్న వయాకామ్‌!

Womens IPL Media Rights: మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం పూర్తైంది. రిలయన్స్‌ నేతృత్వంలోని వయాకామ్‌ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.

Womens IPL Media Rights:

మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం పూర్తైంది. రిలయన్స్‌ నేతృత్వంలోని వయాకామ్‌ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ.951 కోట్లు చెల్లిస్తోంది. అంటే 2023 నుంచి 27 మధ్య జరిగే ప్రతి మ్యాచుకూ రూ.7.09 కోట్లు ఇస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా మీడియా హక్కుల వివరాలను వెల్లడించారు.

'మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల విజేత వయాకామ్‌ 18ను అభినందనలు. పురుషుల, మహిళల క్రికెట్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. రాబోయే ఐదేళ్లకు వయాకామ్‌ రూ.951 కోట్లను చెల్లించనుంది. అంటే ఒక్కో మ్యాచు విలువ రూ.7.09 కోట్లు. మహిళల క్రికెట్‌కు ఇదో గొప్ప విజయం' అని జే షా ట్వీట్‌ చేశారు.

'సమాన వేతనాల తర్వాత మహిళల క్రికెట్‌ సాధించిన మరో గొప్ప విజయం మీడియా హక్కుల బిడ్డింగ్‌. దేశంలో మహిళా క్రికెట్‌ సాధికారతకు ఇదో గొప్ప ముందడుగు. అన్ని వయసుల్లోని అమ్మాయిలు లీగులో పాల్గొనేందుకు ఇది ప్రేరణ కల్పించనుంది. ఇది సరికొత్త సూర్యోదయం' అని ఐసీసీ, బీసీసీఐ మహిళలను జే షా ట్యాగ్‌ చేశారు.

దేశంలో క్రికెట్‌ ప్రసార హక్కులను కొనుగోలు చేయడంలో వయాకామ్‌ 18 దూకుడు ప్రదర్శిస్తోంది. తన మాతృసంస్థ రిలయన్స్‌ అండతో అన్ని క్రీడల హక్కులను కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో పురుషుల ఐపీఎల్‌ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మధ్యే ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌నూ జియో సినిమాలో ప్రసారం చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్‌ఏ20 లీగునూ అందిస్తోంది. పురుషుల ఐపీఎల్‌నూ 4K క్వాలిటీలో 11 భాషాల్లో ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

 మహిళా క్రికెటర్ల కనీస ధరలనూ నిర్ణయించారని తెలిసింది. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఐదు విభాగాలుగా విభజించారని సమాచారం. అమ్మాయిలు వేలంలో పేర్లు నమోదు చేసుకొనేందుకు జనవరి 26 చివరి తేదీ. ఈమేరకు బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు మార్గదర్శకాలు పంపించింది.

ఇప్పటికే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన అమ్మాయిలు, సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో ఉన్నవారు రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల కనీస ధరల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. అరంగేట్రం చేయని క్రికెటర్లు రూ.10 లక్షలు, రూ.20 లక్షల విభాగాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. మహిళల ఐపీఎల్‌లో స్థానిక క్రికెటర్లు ఎక్కువ పాల్గొనేలా చూడాలని రాష్ట్ర సంఘాలను బీసీసీఐ ఆదేశించింది. విదేశీ క్రికెటర్లకూ ఈ ఐదు విభాగాలే ఉంటాయని తెలిపింది.

మహిళల ఐపీఎల్‌ క్రికెటర్ల వేలం తేదీని బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. ఫిబ్రవరి 11న వేలం ఉంటుందని తెలిసింది. మార్చి 6 నుంచి 26 వరకు మహారాష్ట్రలోని వేదికల్లో మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం. వేలంలో నమోదు చేసుకొనే క్రికెటర్లు తమ వ్యక్తిగత స్పాన్సర్లను ధ్రువీకరించాల్సి ఉంటుంది. వేలంలో క్రికెటర్ల ఏజెంట్ల జోక్యాన్ని బీసీసీఐ నిరాకరించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget