అన్వేషించండి

Uppal Match: ఉప్పల్‌ పిచ్‌, ఆర్సీబీ బౌలింగ్‌- హైదరాబాద్‌ జట్టు 300 పరుగుల లోపు ఆలౌట్ అయితే అద్భుతమే!

SRH vs RCB : ఈ ఐపీఎల్ సీజన్‌లో 300 పరుగుల మార్క్‌ను చేరుకుని ఐపీఎల్‌ 17 ఏళ్ల సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలవాలని హైదరాబాద్‌ బ్యాటర్లు పట్టుదలతో ఉన్నారు.

Hyderabad Match : ఈరోజు ఉప్పల్ లో ఆర్సీబీ బౌలింగ్ ధాటికి సన్ రైజర్స్ వణికిపోవటం ఖాయం. సన్ రైజర్స్ 300 పరుగులకే ఆలౌట్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఏదో కాస్త కష్టపడితే సన్ రైజర్స్ 350-400 రన్స్ చేసే అవకాశం ఉంటుందికానీ లేదంటే ఆర్సీబీ బౌలర్లు ఈ సన్ రైజర్స్ బ్యాటర్లను వణికిస్తారు. వాళ్ల బౌలర్లు ఉన్న ఫామ్ కి సన్ రైజర్స్ ఈ సారి పవర్ ప్లేలోనే 200 కొడితే పర్లేదనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా మయాంక్ దాగర్, కర్ణ్ శర్మ స్పిన్ ఉచ్చులో క్లాసెన్ లాంటోడైనా చిక్కుకుని విలవిలాడాల్సిందే. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ తో నిప్పులు విసిరితే అభిషేక్ శర్మ 30 బంతుల్లో సెంచరీకే పరిమితం కావచ్చు. లోకి ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో ట్రావియెస్ హెడ్ 300 స్ట్రైక్ రేట్ కి మించలేకపోవచ్చు. ఇక ప్యాట్ కమిన్స్ సైలెన్స్ ని విరాట్ కొహ్లీ తట్టుకోలేక పెద్దగా అరుచుకోవచ్చు. ఇలాంటివి ఎన్ని ఎన్ని ఎన్ని దారుణాలో ఈ రోజు ఉప్పల్ మ్యాచ్ లో జరగొచ్చు.  అటు సైడు ఫాప్ డుప్లెసీలు, కేమరూన్ గ్రీన్ లు, దినేశ్ కార్తీక్ విరాట్ కొహ్లీతో కలిసి యాజ్ యూజవల్ పోరాటాలు చేసుకున్నా రక్తపాతాలు పారించినా విజయానికి ఒక్క పరుగు దూరం వచ్చి బండిలో పెట్రోల్ అయిపోవటం ఖాయం కాబట్టి ఈసాలా కప్ నమ్మదే బోర్డు నెక్ట్స్ ఇయర్ కి దాచుకోవచ్చు. 

ఈ ఐపీఎల్‌(IPL 2024) సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH).. ప్రత్యర్థి జట్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తొలి బంతి నుంచి విధ్వంసంకర బ్యాటింగ్‌తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. ఢిల్లీపైన విధ్వంసకర బ్యాటింగ్‌తో 250కుపైగా పరుగులు సాధించింది. పవర్‌ ప్లేలో ఒక్క వికెట్‌ కోల్పోకుండా 125 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనే 300 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ అందుకుంటుందని అందరూ భావించారు. కానీ హైదరాబాద్‌ మిడిల్‌ ఆర్డర్‌ కాస్త తడబడడంతో ఈ ఛేదన సాధ్యం కాలేదు.

సొంతగడ్డపై హైదరాబాద్‌ను ఆపగలదా..?
హైదరాబాద్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు దాడి చేసి  277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌.. తమ బ్యాటింగ్‌ గాలివాటం కాదని బెంగళూరు మ్యాచ్‌తో ప్రత్యర్థి జట్లకు చాటిచెప్పింది. అంతేనా ఢిల్లీతో మ్యాచ్‌లో అయితే ఈ విధ్వంసం పతాక స్థాయికి చేరింది. హెడ్‌ శతకంతో చెలరేగిన వేళ రికార్టులు కాలగర్భంలో కలిసిపోయాయి.ఇప్పటికే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ బ్యాటర్లు... ఇప్పుడు మిషన్‌ 300 స్టార్ట్‌ చేశారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 300 పరుగుల మార్క్‌ను చేరుకుని ఐపీఎల్‌ 17 ఏళ్ల సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలవాలని హైదరాబాద్‌ బ్యాటర్లు పట్టుదలతో ఉన్నారు. ఓ వైపు ట్రానిస్‌ హెడ్‌ విధ్వంసం... మరోవైపు అభిషేక్‌ శర్మ మెరుపు దాడి, క్లాసెన్‌, మార్క్రమ్‌ ఊచకోత, అబ్దుల్‌ సమద్‌, నితీశ్‌రెడ్డి తుపాను ఇన్నింగ్స్‌లతో హైదరాబాద్‌ జట్టుకు 300 పరుగుల మార్క్‌ సాధ్యమే అనిపిస్తోంది. పటిష్టమైన ముంబై బౌలర్లను ఎదుర్కొని 277 పరుగులు చేసిన హైదరాబాద్‌... బెంగళూరు బౌలింగ్‌నూ ఊచకోత కోసి 287 పరుగులు చేసింది. ఢిల్లీపైనా 250కుపైగా పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగలు చేసిన హైదరాబాద్‌.. మరోసారి 300 పరుగుల లక్ష్యంపై కన్నేసింది. ముంబై జట్టులో బుమ్రా , బెంగళూరు జట్టులో సిరాజ్‌, ఢిల్లీ జట్టులోనూ టీమిండియా స్టార్ పేసర్లు ఉన్నా హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసం కొనసాగింది. మరోసారి హైదరాబాద్‌ టాపార్డర్‌... సునామీ సృష్టిస్తే అందులో 300 పరుగుల మార్క్‌ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. హైదరాబాద్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే 300 పరుగుల రికార్డు బద్దలు కావచ్చని ఇప్పటికే మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. 300 పరుగుల మార్క్‌ను హైదరాబాద్‌ బద్దలు కొట్టవచ్చన్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
Vaibhav Sooryavanshi News: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
RCB Postpone Title Celebrations: ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు
ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget