అన్వేషించండి

PBKS vs RCB, Match Highlights: పంజాబ్ పాత కథే! విజయానికి చేరువై బోల్తా! ప్లేఆఫ్స్‌ చేరిన కోహ్లీసేన

కోహ్లీసేన ప్లేఆఫ్స్‌ ఖాయం చేసుకుంది! పంజాబ్‌ కింగ్స్‌పై విజయం అందుకుంది. 16 పాయింట్లతో తన స్థానం మరింత పదిలం చేసుకుంది. 165 పరుగుల లక్ష్యాన్ని రక్షించుకుంది.

కోహ్లీసేన ప్లేఆఫ్స్‌ ఖాయం చేసుకుంది. 16 పాయింట్లతో తన స్థానం మరింత పటిష్ఠంగా మార్చుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. 165 పరుగుల లక్ష్యాన్ని రక్షించుకుంది. ఛేదనలో పంజాబ్‌కు కేఎల్‌ రాహుల్‌ (39; 35 బంతుల్లో 1x4, 2x6 ), మయాంక్ అగర్వాల్‌ (57; 42 బంతుల్లో 6x4, 2x6) అద్భుతమైన ఓపెనింగ్‌ ఇచ్చారు. అంతకు ముందు బెంగళూరులో మాక్స్‌వెల్‌ (57; 33 బంతుల్లో 3x4, 4x6), దేవదత్‌ పడిక్కల్‌ (40; 38 బంతుల్లో 4x4, 2x6) రాణించారు.

Also Read: చెన్నైపై ఆరు వికెట్లతో రాజస్తాన్ విజయం.. పాపం గైక్వాడ్.. సెంచరీ వృథా!

ఓపెనర్లు ఉన్నంత వరకే..!
పరిస్థితులు భిన్నంగా ఉన్నా ఛేదనను పంజాబ్‌ బాగానే ఆరంభించింది. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ కళ్లుచెదిరే సిక్సర్లు, బౌండరీలు బాదేశారు. పవర్‌ప్లేలో 49 పరుగులు అందించారు. 10 ఓవర్లకు జట్టును 81-0తో బలంగా నిలిపారు. జట్టు స్కోరు 91 వద్ద రాహుల్‌ను షాబాజ్‌ ఔట్‌ చేసినా మయాంక్‌ 36 బంతుల్లో అర్ధశతకం అందుకోవడంతో అంతా సవ్యంగానే అనిపించింది. స్పిన్నర్లు పరుగుల్ని నియంత్రించడం.. నికోలస్‌ పూరన్‌ (3) ఔటవ్వడంతో మయాంక్‌పై ఒత్తిడి పెరిగింది. జట్టు స్కోరు 114 వద్ద అతడిని చాహల్‌ బోల్తా కొట్టించడంతో పంజాబ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. మార్‌క్రమ్‌ (20), షారుక్‌ (16) ఒకట్రెండు షాట్లు ఆడినా చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగింది. ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా పంజాబ్‌ 12 పరుగులే చేసి 158-6కు పరిమితమైంది.

Also Read: పతకాల పంట సాధించిన భారతీయ షూటర్లు.. అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి!

రక్షించిన మాక్సీ
బెంగళూరు ఇన్నింగ్స్‌ రెండు దశలుగా సాగింది. నెమ్మది పిచ్‌పై వారికి అదిరే ఆరంభం దొరికింది. వేగం తగ్గించకుండా బంతులు వేయడంతో ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ పంజాబ్‌ పేసర్లను ఉతికారేశారు. పవర్‌ప్లే ముగిసే సరికే 55 పరుగులు చేశారు. వికెట్‌ కోసం ఎదురు చూస్తున్న రాహుల్‌ సేనకు హెన్రిక్స్‌ అండగా నిలిచాడు. 68 వద్ద కోహ్లీ, క్రిస్టియన్ (0), 73 వద్ద పడిక్కల్‌ను ఔట్‌ చేశాడు. ఈక్రమంలో మాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌ (23) దుమ్మురేపారు. పంజాబ్‌ స్పిన్నర్లు పరుగులు ఇవ్వకున్నా మాక్సీ స్విచ్‌హిట్‌, స్లాగ్‌స్వీప్‌తో సిక్సర్లు బాదేశాడు. 29 బంతుల్లో అర్ధశతకం బాదేశాడు. నాలుగో వికెట్‌కు 73 (39 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించాడు.  18.3 ఓవర్లకు స్కోరును 150కి చేర్చాడు. ఆఖరి ఓవర్లో షమి.. మాక్సీ, షాబాజ్‌ (8), గార్టన్‌ (0)ను ఔట్‌ చేయడంతో స్కోరు 164/7కు చేరింది.

Also Read: తెల్లబంతి క్రికెట్లో ఎంఎస్‌ ధోనీ 'ది కింగ్‌ కాంగ్‌'! అతడు సాధించనిది ఏముందన్న రవిశాస్త్రి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget