అన్వేషించండి

IPL 2021: యూఏఈలో ముంబయి ఇండియన్స్‌ ఎందుకు గెలవగలదంటే..? గౌతీ వివరణ ఇదీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను మరోసారి గెలిచేందుకు ముంబయి ఇండియన్స్‌కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అంటున్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను మరోసారి గెలిచేందుకు ముంబయి ఇండియన్స్‌కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అంటున్నాడు. యూఏఈ పిచ్‌లకు అవసరమైన అన్ని వనరులు ఆ జట్టుకు ఉన్నాయని తెలిపాడు.  ఐపీఎల్‌ రెండో దశలో ఆ జట్టు వరుస విజయాలు సాధించే అవకాశం ఉందటున్నాడు.

యూఏఈ పిచ్‌లు, పరిస్థితులు ముంబయి ఇండియన్స్ పేసర్లకు అనుకూలిస్తాయని గంభీర్ అంటున్నాడు 'ఐపీఎల్‌ మొదటి దశలో ముంబయి ఇండియన్స్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. సాధారణంగా ఆడే పిచ్‌లకు భిన్నమైన వికెట్లపై ఆడారు. ఎందుకంటే వాంఖడేతో పోలిస్తే చెపాక్‌, దిల్లీ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వారు తమకు అలవాటైన పరిస్థితుల్లో ఆడనున్నారు. యూఏఈ పిచ్‌లు ముంబయి ఫాస్ట్‌ బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌బౌల్ట్‌కు నప్పుతాయి' అని గంభీర్‌ అన్నాడు.

Also Read: Lasith Malinga Retirement: క్రికెట్ కు మ‌లింగ గుడ్ బై.. ఒక‌ప్పుడు బ్యాట్స్ మ‌న్ కు సింహ‌స్వ‌ప్నం!

'యూఏఈలో బంతి స్వింగ్‌ అవుతుంది. కాబట్టి ముంబయి పేసర్లను ఎదుర్కోవడం కష్టం. నాణ్యమైన పేసర్లు ఉండటంతో ముంబయి సైతం బంతి స్వింగ్‌ అవ్వాలనే కోరుకుంటుంది. అది వాళ్లకు ఉపయోగం. అంతేకాకుండా వారి బ్యాటర్లు బంతి బ్యాటుపైకి రావాలని కోరుకుంటారు. రోహిత్‌,  హార్దిక్ పాండ్య వంటి బ్యాటర్లు చెపాక్‌లో ఇబ్బంది పడటం గమనించాం. ఎందుకంటే బంతి అక్కడ విపరీతంగా టర్న్‌ అవుతుంది' అని గౌతీ పేర్కొన్నాడు.

Also Read: Suresh Raina romantic with Priyanka: బిగ్‌బాస్‌కు వెళ్తానంటున్న రైనా.. ప్రియాంకతో కలిసి 'మిస్టర్‌ ఐపీఎల్‌' రొమాంటిక్‌ కబుర్లు

'దుబాయ్‌, అబుదాబిలో ముంబయి బ్యాటర్లు ఇబ్బంది పడరు. అందుకే ముంబయికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాను. ఆలస్యంగా విజయాలు సాధించాలని వారనుకోరు. ఎందుకంటే ఉన్నది ఏడు మ్యాచులే. పైగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే వారు కనీసం ఐదు మ్యాచులు గెలవాలి. అందుకే నిదానంగా ఆడే పరిస్థితి వారికి లేదు' అని గంభీర్‌ వెల్లడించాడు.

ఐపీఎల్‌ రెండో దశలో తొలి మ్యాచులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ముంబయి ఢీకొట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచు కోసం ముంబయి ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే యూఏఈలోని శిబిరంలో కఠిన సాధన చేస్తోంది. లండన్‌ నుంచి శిబిరానికి వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మైదానంలో అడుగుపెట్టాడు. కసరత్తులు చేస్తున్నాడు. జట్టులో జోష్‌ నింపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను ముంబయి సోషల్‌ మీడియాలో పంచుకుంది.

Also Read: IPL Auction Date: పది జట్ల ఐపీఎల్‌కు అంకురార్పణ.. అక్టోబర్‌ 17నే ఫ్రాంచైజీల వేలం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget