21/0 ఓవర్నైట్ స్కోర్తో భారత్ బరిలోకి దిగింది. టీమ్ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్(36), రాహుల్ నిలకడగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మకు(36) సామ్కరన్ అడ్డుకట్ట వేశాడు. ఫలితంగా 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. భోజన విరామానికి ముందు 97/1తో ఉన్న భారత జట్టు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప తేడాలో పుజారా(4), కెప్టెన్ కోహ్లీ(0), వైస్ కెప్టెన్ అజింక్య రహానె(5) ఔటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే రాహుల్, పంత్ నిలకడగా ఆడారు. జట్టు స్కోరును గాడిలో పెడుతున్నారు. ఈ సమయంలోనే వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిపివేశారు.