అన్వేషించండి

Rishabh Pant Record: వాండరర్స్‌లో 'పంత్‌' సెంచరీ..! ధోనీ కన్నా ముందుగానే!

రిషభ్ పంత్‌ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా వంద క్యాచుల రికార్డు అందుకున్నాడు. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ, సయ్యద్‌ కిర్మాణి, కిరణ్‌ మోరె వంటి దిగ్గజాల సరసన నిలిచాడు.

టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా వంద క్యాచుల రికార్డు అందుకున్నాడు. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ, సయ్యద్‌ కిర్మాణి, కిరణ్‌ మోరె వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో అతడీ ఘనత సాధించాడు.

కేవలం 24 ఏళ్ల వయసులోనే పంత్‌ ఈ రికార్డు అందుకోవడం ప్రత్యేకం. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ బౌలింగ్‌లో సఫారీ ఆటగాడు లుంగి ఎంగిడి క్యాచ్‌ అందుకోవడంతో ఈ మైలురాయికి చేరుకున్నాడు. మొత్తంగా టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్లో వంద క్యాచులు అందుకున్న నాలుగో వికెట్‌ కీపర్‌గా పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఎంఎస్ ధోనీ (256), సయ్యద్‌ కిర్మాణి (160), కిరణ్‌ మోరె (110) సరసన నిలిచాడు. ఇక అంతర్జాతీయంగా ఈ ఘనత అందుకున్న 42వ వికెట్‌కీపర్‌గానూ తన పేరు లిఖించాడు.

వంద క్యాచుల ఘనత అందుకోవడానికి రిషభ్ పంత్‌ 26 టెస్టులు, 50 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎంఎస్ ధోనీ, వృద్ధిమాన్‌ సాహా 36 టెస్టుల్లో ఈ రికార్డు సాధించారు. మరోవైపు రెండో టెస్టులో యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దక్షిణాఫ్రికాలో ఏడు వికెట్ల ఘనత అందుకున్న తొలి బౌలర్గా అవతరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు.

రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం, రెండోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్ల నష్టానికి  85 పరుగులు చేసింది. 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. అజింక్య రహానే (11 బ్యాటింగ్: 22 బంతుల్లో, ఒక ఫోర్), చెతేశ్వర్ పుజారా (35 బ్యాటింగ్: 42 బంతుల్లో, ఏడు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులు చేయగలిగింది. దీంతో ఆతిథ్య జట్టుకు 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 200+ పరుగులు చేస్తే టీమ్‌ఇండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget