అన్వేషించండి

Virat Kohli vs Jonny Bairstow: 18 నెలల్లో కోహ్లీ రన్స్‌ కన్నా 25 రోజుల్లో బెయిర్‌స్టో కొట్టిందే ఎక్కువట!

Virat Kohli vs Jonny Bairstow: ఐదో టెస్టులో జానీ బెయిర్‌స్టో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు కొట్టాడు. అతడి ఫామ్‌ను అడ్డం పెట్టుకొని విరాట్‌ కోహ్లీని ఇంగ్లాండ్‌ బార్మీ ఆర్మీ అనవసరంగా కవ్విస్తోంది.

Virat Kohli vs Jonny Bairstow: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. సిరీస్‌ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక చివరి టెస్టులో ఇంగ్లిష్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వరుసగా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు కొట్టాడు. ఈ ఏడాది తిరుగులేని ఫామ్‌ కనబరుస్తున్నాడు. అయితే అతడి ఫామ్‌ను అడ్డం పెట్టుకొని విరాట్‌ కోహ్లీని ఇంగ్లాండ్‌ బార్మీ ఆర్మీ అనవసరంగా కవ్విస్తోంది. అవమాన పరిచేలా ట్వీట్లు పెడుతోంది.

గత 18 నెలల్లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) చేసిన పరుగుల కన్నా చివరి 25 రోజుల్లో జానీ బెయిర్‌ స్టో  (Jonny Bairstow) చేసినవే ఎక్కువని బార్మీ ఆర్మీ ట్వీట్‌ చేసింది. ఒక రకంగా అతడిని ఎగతాళి చేసింది! ప్రస్తుతం విరాట్‌ అంచనాలకు మించి రాణించడం లేదు. రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ కొట్టలేదు. అతడి పేలవ ఫామ్‌ను గుర్తుచేస్తూ ఆంగ్లేయులు ట్వీట్లు చేయడం టీమ్‌ఇండియా అభిమానులను బాధిస్తోంది. ఒకప్పుడు ఇంగ్లాండ్‌ బౌలర్లను అతడెలా ఊచకోత కోశాడో మర్చిపోవద్దని ఫ్యాన్స్‌ గుర్తు చేస్తున్నారు. అతడు టన్నుల కొద్దీ పరుగులు చేసేటప్పుడు బెయిర్‌స్టో పరిస్థితేంటో చూసుకోవాలని ఫైర్‌ అయ్యారు.

Also Read: ఓటమికి తోడు టీమ్‌ఇండియాకు మరో షాక్‌! WTC ఫైనల్‌ అర్హతకు ప్రమాదం!

Also Read: బాజ్‌ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్‌ ద్రవిడ్‌

విరాట్‌ కోహ్లీ 2011లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 102 మ్యాచులాడి 49.53 సగటు, 55.68 స్ట్రైక్‌రేట్‌తో 8,074 పరుగులు సాధించాడు. 27 సెంచరీలు, 28 అర్ధ శతకాలు అందుకున్నాడు. ఇక ఇంగ్లాండ్‌ గడ్డపై 16 మ్యాచులాడితే 33.32 సగటు 51 స్ట్రైక్‌రేట్‌తో 1033 రన్స్‌ కొట్టాడు. భారత్‌లో 46 మ్యాచులాడి 61 సగటు, 59 స్ట్రైక్‌రేట్‌తో 3847 పరుగులు చేశాడు. 2016, 2017, 2018లో 1000+ రన్స్‌ చేశాడు. 2012 నుంచి 2019 వరకు కనీసం 600కు తక్కువ కాకుండా విజృంభించాడు. 2020లో 3 టెస్టులాడి 116, 2021లో 11 మ్యాచులాడి 536, 2022లో 4 టెస్టుల్లో 220 సాధించాడు.

జానీ బెయిర్‌స్టో 2012లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులాడి 37 సగటు, 57 స్ట్రైక్‌రేట్‌తో 5415 రన్స్‌ చేశాడు. 12 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. విరాట్‌ చేసిన 27 సెంచరీలతో పోలిస్తే ఓ లెక్కే కాదు! భారత గడ్డపై జానీ 8 మ్యాచుల్లో 29 సగటు, 49 స్ట్రైక్‌రేట్‌తో 389 పరుగులు చేశాడు. విరాట్‌తో పోలిస్తే ప్రత్యర్థి గడ్డపై సగమైనా కొట్టలేదు. సొంతదేశం ఇంగ్లాండ్‌ గడ్డపై 48 టెస్టుల్లో 39 సగటు, 61 స్ట్రైక్‌రేట్‌తో 3076 పరుగులు సాధించాడు.  అంటే సొంతగడ్డపై కోహ్లీ కన్నా ఎక్కువ మ్యాచులాడి తక్కువ రన్స్‌ కొట్టాడన్నమాట. అతడి జీవితకాలంలో 1000+ రన్స్‌ కొట్టింది 2016లో మాత్రమే. 600+ రన్స్‌ చేసింది కేవలం నాలుగేళ్లే.  2016లో మూడు, 2017లో  ఒకటి, 2018లో 2 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత 2022లో 6 కొట్టాడు. 

అందుకే బార్మీ ఆర్మీ ఒకసారి చరిత్రను చూసుకుంటే బెటరని కింగ్‌ కోహ్లీ అభిమానులు స్పందిస్తున్నారు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాడంటే అతడినెవరూ ఆపలేరని సవాల్‌ చేస్తున్నారు. అనవసరంగా ఇలాంటి పోలికలు పెట్టొద్దని సూచిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget