అన్వేషించండి

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి. టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో పసిడి పతకాలు వచ్చాయి.

కామన్వెల్త్ క్రీడల్లో నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు 4 పతకాలు వచ్చాయి. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ స్వర్ణం గెలిచాడు. మరో ఆటగాడు సాతియన్‌ జ్ఞానశేఖరన్‌ కాంస్యం కైవసం చేసుకుంది. ఇక బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ పసిడి పతకం పట్టేసింది. పురుషుల హాకీలో టీమ్‌ఇండియా రజతానికే పరిమితమైంది.

సాత్విక్‌, చిరాగ్‌ రికార్డు

బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తరఫున తొలి పతకం గెలిచిన పురుషుల జోడీగా అవతరించారు. ఇంగ్లాండ్‌ ద్వయం బెన్‌ లేన్‌, సేన్‌ వెండీని 21-15, 21-13 తేడాతో చిత్తు చేశారు. తొలి గేమ్‌లో రెండు జోడీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. 1-1, 5-5, 8-8, 10-10తో సమంగా ఆడారు. ఆ తర్వాత భారత్‌ జోడీ విజృంభించింది. వరుస పాయింట్లతో చెలరేగి 18-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 21-15 గేమ్‌ గెలిచేసింది. రెండో గేమ్‌లోనూ 7-7, 9-9 రెండు జోడీలు శ్రమించాయి. విరామం తర్వాత భారత ఆటగాళ్లూ దూకుడు పెంచారు. 21-13 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచును గెలిచేశారు.

శరత్‌ కమల్‌ ఎన్నాళ్లకో

టేబుల్‌ టెన్నిస్‌లో రెండు పతకాలు వచ్చాయి. సీనియర్‌ ప్యాడ్లర్‌ ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణం ముద్దాడాడు. ఇంగ్లాండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ను 4-1 తేడాతో ఓడించాడు. 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. 2006 మెల్‌బోర్న్‌ కామన్వెల్త్‌ తర్వాత అతడు ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. అంతకు ముందు పురుషుల సింగిల్స్‌లో సాతియన్‌ కాంస్యం కొల్లగొట్టాడు. ఇంగ్లాండ్‌ ప్యాడ్లర్‌ పాల్‌ డ్రింఖాల్‌ను 11-9, 11-3, 11-5, 8-11, 10-12, 11-9 తేడాతో ఓడించాడు.

రజతమే ముద్దు!

భారత పురుషుల హాకీ జట్టు రజతం సొంతం చేసుకుంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియా చేతిలో 0-7తో పరాభవం చవిచూసింది. గేమ్‌ ఆరంభం నుంచి కంగారూలు టీమ్‌ఇండియాకు వణుకు పుట్టించారు. పదేపదే డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్స్‌ వర్షం కురిపించారు. తొలి తొలి  క్వార్టర్లో 2, రెండో క్వార్టర్లో 3, మూడు, నాలుగో క్వార్టర్లో ఒక్కో గోల్‌ చొప్పున నమోదు చేశారు. కామన్‌వెల్త్‌లో టీమ్‌ఇండియా రజతానికే పరిమితం అవ్వడం ఇది మూడోసారి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Yadadri Bhongir Lorry Fire Visuals | పెట్రోల్ బంకులో పేలిన లారీ..కానీ అతనేం చేశాడంటే.? | ABP DesamEC Decision on Loose Petrol and Diesel | కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం | ABP DesamActress Hema in Bangluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ గురించి హేమ సంచలన వీడియో విడుదల | ABPTadipatri Tension |తాడిపత్రిలో ఈరోజు ఏం జరగనుంది..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
TS ECET - 2024 Results: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
TS ECET - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 95.86 శాతం ఉత్తీర్ణులు - ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Nellore News: కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
Embed widget