News
News
X

భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20కి విరాట్ కోహ్లీకి విశ్రాంతి!

బీసీసీఐ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రోటీస్‌తో జరిగే ఆఖరి టీ20 మ్యాచ్‌ కోసం విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వబోతున్నారు. ఆయనతో పాటు మరికొందరు సీనియర్ ప్లేయర్లకు కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

FOLLOW US: 
Share:

ఈ సాయంత్రం ఇండోర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మూడో టీ20కి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించే అవకాశం ఉంది. బీసీసీఐ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం, అక్టోబర్ 23న ప్రపంచకప్‌ మ్యాచ్‌ భారత్ ఆడనుంది. 
ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. దీని కోసం కోహ్లీతోపాటు సీనియర్లు అంతా ఫామ్‌లో, ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని బీసీసీ భావన. అందుకే ప్రోటీస్‌తో జరిగిన మూడో టీ20కి భారత మాజీ కెప్టెన్‌కు విశ్రాంతి లభించే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాపై భారత్‌ ఇప్పటికే 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. మెన్ ఇన్ బ్లూ మొదటి,రెండో టీ20 మ్యాచ్‌లలో జబర్దస్త్‌ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను మొదటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో రెండో మ్యాచ్‌ను 16 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అందుకే ఇవాళ సాయంత్రం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ నామమాత్రంగా మారింది. 

టీ20 చరిత్రలో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత్‌గా కోహ్లి ఆదివారం రికార్డు సృష్టించాడు. ఆదివారం ఇక్కడ గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో అతను ఈ ఘనత సాధించాడు. 19 పరుగులు చేసిన తర్వాత మ్యాచ్‌లో, విరాట్ కేవలం 354 మ్యాచ్‌లలో 11,000 టీ20 పరుగులను అత్యంత వేగంగా చేరుకున్నాడు.

వేన్ పార్నెల్ ఓవర్‌లో భారత మాజీ కెప్టెన్ కోహ్లీ లాంగ్-ఆఫ్‌లో అద్భుతమైన సిక్సర్‌ కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆ సిక్స్‌తో కోహ్లి టీ20 చరిత్రలో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర తిరగరాశాడు. 

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కోహ్లీ తన క్లాస్ గేమ్‌తో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. మైదానం చుట్టూ బంతిని కొడుతూ నాణ్యమైన షాట్‌లతో 49 పరుగులు చేశాడు.

పేలవమైన ఫామ్‌తో కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ 71వ సెంచరీ కోసం నిరీక్షణ 1,020 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆసియా కప్‌లో చివర మ్యాచ్‌లో తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు కోహ్లీ. ఆఫ్ఘనిస్తాన్‌పై 61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలా చేయడం ద్వారా రికీ పాంటింగ్ 71 అంతర్జాతీయ టన్నుల రికార్డును సమం చేశాడు విరాట్.

ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022లో విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అతని 71వ అంతర్జాతీయ టోర్నీని కూడా పూర్తి చేశాడు. కోహ్లి ఐదు మ్యాచ్‌ల్లో 92.00 సగటుతో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో 276 పరుగులు చేశాడు.

Published at : 04 Oct 2022 03:57 PM (IST) Tags: Virat Kohli BCCI T20 SA vs IND

సంబంధిత కథనాలు

ఉప్పల్ ఊపిరి పీల్చుకో..  ఐపీఎల్ ఆగయా..! హైదరాబాద్‌లో సన్ రైజర్స్ రికార్డులివే..

ఉప్పల్ ఊపిరి పీల్చుకో.. ఐపీఎల్ ఆగయా..! హైదరాబాద్‌లో సన్ రైజర్స్ రికార్డులివే..

CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!

CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!

Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్

Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్

Kane Williamson Injury: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ - కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!

Kane Williamson Injury: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ - కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!

Ruturaj Gaikwad: మొదటి మ్యాచ్‌లో రుతురాజ్ వీర విహారం - 23 బంతుల్లోనే అర్థ సెంచరీ!

Ruturaj Gaikwad: మొదటి మ్యాచ్‌లో రుతురాజ్ వీర విహారం - 23 బంతుల్లోనే అర్థ సెంచరీ!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి