అన్వేషించండి

Cricket World Cup 2023: 'మమ్మల్ని ఎవరూ శాసించలేరు'- రమీజ్ రజా వ్యాఖ్యలపై భారత క్రీడల మంత్రి స్పందన

వచ్చే ఏడాది పాక్ లో జరిగే ఆసియా కప్ లో టీమిండియా ఆడకపోతే తాము కూడా భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచకప్ లో ఆడమని పీసీబీ చీఫ్ రమీజ్ రజా వ్యాఖ్యలపై క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఏమన్నారంటే..

Cricket World Cup 2023:  వచ్చే ఏడాది పాక్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలపై... క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.  ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని.. తమను ఎవరూ శాసించలేరని అన్నారు.

కొన్నాళ్లు కిందట బీసీసీఐ కార్యదర్శ జైషా... పాక్ లో జరిగే ఆసియా కప్ లో భారత్ ఆడబోదంటూ వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికలపైనే భారత్, పాకిస్థాన్ తో తలపడుతుందని.. ఆ దేశంలో పర్యటించే అవకాశం లేదని అన్నారు. జైషా వ్యాఖ్యలపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా అప్పుడే స్పందించారు. మళ్లీ ప్రస్తుతం ఆయన పీసీబీ చీఫ్ హోదాలో అధికారికంగా ఈ విషయంపై మాట్లాడారు. భారత్, పాక్ లో ఆసియా కప్ ఆడకుంటే... పాకిస్థాన్ 2023 లో భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ లో ఆడదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. 

‘‘భారత్‌, పాక్‌ బోర్డుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై సరైన సమయంలో తప్పకుండా స్పందిస్తాం. అయితే ప్రపంచ క్రీడల్లోనే అత్యంత శక్తిమంతమైన దేశం భారత్‌. ఇతర దేశాలు ఏవీ మాపై అధికారం చెలాయించలేవు’’ అని అనురాగ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో అన్ని దేశాలు పాల్గొంటాయని గతంలోనే అనురాగ్‌ తెలిపారు. ఇది బీసీసీఐ అంతర్గత విషయమని, సరైన దిశగానే పరిష్కారమవుతుందని వెల్లడించారు.

వారు రాకపోతే మేం వెళ్లం: రమీజ్ రజా

'గత కొంతకాలంగా పాకిస్థాన్ నాణ్యమైన క్రికెట్ ఆడుతోంది. భారత్ ను రెండుసార్లు ఓడించింది. వాళ్లు ఆసియా కప్ కోసం ఇక్కడకు రాకపోతే.. మేం ప్రపంచకప్ ఆడడానికి అక్కడకు వెళ్లం. ప్రపంచకప్ లో పాక్ ఆడకపోతే ఆ టోర్నీని ఎవరు చూస్తారు? మేం ఆటలో దూకుడు విధానాన్ని అనుసరిస్తున్నాం. మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. జట్టు మంచి ఆట ఆడితే పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. బిలియన్ డాలర్ల ఎకానమీ కలిగిన బోర్డు ఉన్న జట్టును పాక్ నెలల వ్యవధిలో రెండుసార్లు ఓడించింది.' అని రమీజ్ రజా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 

2009లో పాకిస్థాన్ లోని గడాఫీ మైదానం వెలుపల శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం.. ఆ దేశంలో క్రికెట్‌ ఆడటం ప్రపంచ దేశాలు మానేశాయి. అక్కడ 2009లో నిర్వహించిన ఆసియా కప్పే చివరి అంతర్జాతీయ లీగ్.  ఆ తర్వాత పరిస్థితులు మారటంతో 2015లో జింబాబ్వే, 2017లో శ్రీలంక అక్కడ పర్యటించాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కూడా ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడింది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
Telangana News: ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
Super IAS: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Darien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP DesamAdvocate Serious on Hydra Ranganath | హైడ్రా కమిషనర్ పై చిందులేసిన అడ్వొకేట్ | ABP DesamMLC Candidate GV Sunder Interview | మూడు నినాదాలతో గ్రాడ్యుయేట్ MLC బరిలో ఉన్నా | ABP DesamVijaya Sai Reddy Counters YS Jagan | నేను ఎవడికీ అమ్ముడుపోలేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
Telangana News: ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే! 
Super IAS: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Mana Mitra WhatsApp Governance And Digi Locker: మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
Walayar Case: అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న మైనర్లు - కేసులో మిస్టరీ వీడాకా అంతా షాక్ - తల్లే ..
అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న మైనర్లు - కేసులో మిస్టరీ వీడాకా అంతా షాక్ - తల్లే ..
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. చాట్ జీపీటీలో మెటా ఏఐ కన్నా పవర్ ఫుల్ ఫీచర్లు
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. చాట్ జీపీటీలో మెటా ఏఐ కన్నా పవర్ ఫుల్ ఫీచర్లు
Jack Teaser: వీడు మాములు క్రాక్ కాదు బాబోయ్... బర్త్‌ డే బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ టీజర్ ఎలా ఉందంటే?
వీడు మాములు క్రాక్ కాదు బాబోయ్... బర్త్‌ డే బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ టీజర్ ఎలా ఉందంటే?
Embed widget