అన్వేషించండి

Saurabh Tiwary: క్రికెట్‌కు మరో ధోనీ గుడ్‌ బై , వీడ్కోలు పలికిన సౌరభ్‌ తివారి

Saurabh Tiwary: టీమిండియా వెటరన్ క్రికెటర్ సౌరభ్‌ తివారి వీడ్కోలు పలకనున్నాడు.జార్ఖండ్‌‌కు చెందిన 34 ఏళ్ల తివారి రంజీ ట్రోఫీ 2024లో తన జట్టు ప్రస్థానం ముగిసిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు.

Saurabh Tiwary announces retirement: టీమిండియా వెటరన్ క్రికెటర్, ఝార్ఖండ్‌ బ్యాటర్‌ సౌరభ్‌ తివారి(Saurabh Tiwary) వీడ్కోలు పలకనున్నాడు. 17 ఏళ్ల కెరీర్‌‌లో జార్ఖండ్‌‌(Jharkhand)కు ఎక్కువగా ఆడిన సౌరభ్‌‌ టీమిండియా(Team India) తరఫున మూడు వన్డేల్లో బరిలోకి దిగాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు. తివారికి హార్డ్‌ హిట్టర్‌గా పేరుంది. అతనిని అందరూ మరో ధోని అనే వారు.

జార్ఖండ్‌కు చెందిన 34 ఏళ్ల తివారి రంజీ ట్రోఫీ 2024లో తన జట్టు ప్రస్థానం ముగిసిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. హర్యానాతో జరిగిన తన ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో జార్ఖండ్ 205 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తన చివరి రంజీ మ్యాచ్‌లోనూ 23, 3 పరుగులే చేశాడు. మణిపూర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మాత్రం అజేయ శతకం సాధించాడు.ఈ పరాజయంతో జార్ఖండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. జాతీయ జట్టుకు ఐపీఎల్‌కు ఆడనప్పుడు ఆటను కొనసాగించడం వృథా అని సౌరభ్ తివారి అభిప్రాయపడ్డాడు. తాను తప్పుకుంటే కుర్రాళ్లకైనా అవకాశం వస్తుందని చెప్పుకొచ్చాడు. టీమిండియా టెస్ట్ టీమ్‌లో కుర్రాళ్లకు చోటుదక్కే అవకాశం ఉందని, అందుకే తాను ఆట నుంచి వైదొలిగి వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని తెలిపాడు. 17 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో కొనసాగిన తివారి.. భారత్ తరఫున మూడు వన్డేలు.. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌‌లు ఆడాడు. ఐపీఎల్ 2010 సీజన్‌లో ముంబై తరఫున మెరుపులు మెరిపించిన సౌరభ్ తివారి.. ఆ సీజన్‌లో 419 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై 49 పరుగులే చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో విఫలమైనా.. దేశవాళీలో సత్తా చాటాడు. 

34 ఏళ్ల సౌరభ్‌ టీమ్‌ఇండియా తరపున 2010లో 3 వన్డేలాడి 49 పరుగులు చేశాడు. 115 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 47.51 సగటుతో 8030 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌ల్లో 1494 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. 116 లిస్ట్‌- ఎ మ్యాచ్‌ల్లో 4050 పరుగులు చేశాడు. ‘‘పాఠశాలకు వెళ్లకముందే ప్రారంభమైన ఈ ప్రయాణానికి ముగింపు పలకడం కష్టమైందే. కానీ అందుకు ఇదే సరైన సమయం. జాతీయ జట్టులో, ఐపీఎల్‌లో లేనప్పుడు యువ ఆటగాడి కోసం రాష్ట్ర జట్టులో స్థానాన్ని ఖాళీ చేయాలని భావించాను’’ అని సౌరభ్‌ పేర్కొన్నాడు. 

అతను జార్ఖండ్‌ తరఫున 115 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. ఈ గణంకాలు అదే జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కంటే ఎక్కువ కావడం విశేషం. తివారి కోహ్లి నేతృత్వంలోని అండర్‌-19 ప్రపంచకప్‌ (2008) గెలిచిన భారత యువ జట్టులో సభ్యుడు కావడం మరో విశేషం. . ‘ఇదే సరైన సమ యం అనుకుంటున్నా. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌ పోటీలో లేనప్పుడు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. యువ ఆటగాళ్ల అవకాశాలను కాలరాయడం సరికాదు’ అని సౌరభ్‌ పేర్కొన్నాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget