అన్వేషించండి

Virat Kohli : విరాట్‌ సెంచరీపై పుజారా అసంతృప్తి

ODI World Cup 2023: బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ శకతంపై టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, ది వాల్‌ చటేశ్వర్‌ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ సెంచరీపై పుజారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో విరాట్‌ కోహ్లీ టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అసలు సెంచరీ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ విరాట్‌ శతకం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బంగ్లాపై గెలవాలంటే టీమిండియాకు 24 పరుగులు కావాలి. ఆ సమయంలో కోహ్లీ 74 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అంటే కోహ్లీ సెంచరీకి 26 పరుగులు కావాలి. 74 పరుగుల తర్వాత 26 పరుగులను పూర్తి చేసిన కోహ్లీ అటు జట్టుకు విజయాన్ని ఇటు శతకాన్ని సాధించాడు. 
 
అయితే బంగ్లా మ్యాచ్‌లో కోహ్లీ శతకం కోసం సింగిల్స్ తీయకుండా ఆడడాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరి నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది. సెంచరీ కోసం భారత గెలుపును విరాట్ ఆలస్యం చేశాడని కొందరు విమర్శిస్తున్నారు.  
 
సెంచరీలకు కాదని జట్టు విజయానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పుజారా స్పష్టం చేశాడు. తాను కూడా కోహ్లీ  సెంచరీ సాధించాలని ఎంతగానో కోరుకున్నానని కానీ ఇదే సమయంలో మ్యాచ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని కూడా గుర్తు పెట్టుకోవాలని పుజారా అన్నాడు. నెట్‌ రన్‌రేట్‌తో టీమిండియా అగ్రస్థానంలో ఉండాలని.. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీల్లో నెట్‌ రన్‌ రేట్‌ కీలకమని మర్చిపోవద్దని పుజారా సూచించాడు. కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లు జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ఆటగాళ్లు కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుందని.. జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని టీమిండియా ఆటగాళ్లకు పుజారా సూచించాడు. వ్యక్తిగత మైలురాళ్లు జట్టు ప్రయోజనాలకు ఇబ్బంది కాకుడదని వ్యాఖ్యానించాడు. జట్టు గెలిచే క్రమంలో వచ్చే వ్యక్తిగత మైలురాళ్లు కూడా ముఖ్యమేనని పుజారా అన్నాడు. 
 
అసలేంటి వివాదం..?
బంగ్లాపై గెలవాలంటే టీమిండియాకు 24 పరుగులు కావాలి. ఆ సమయంలో కోహ్లీ 74 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అంటే కోహ్లీ సెంచరీకి 26 పరుగులు కావాలి. అయితే విరాట్‌ సెంచరీ వద్దనుకున్నాడని... కానీ తానే సెంచరీ సాధించాలని చెప్పినట్లు రాహుల్‌ వెల్లడించాడు. విరాట్‌ కోహ్లీ సింగిల్స్‌ తీస్తానని చెప్పినా తానే వద్దని చెప్పానని... సెంచరీ సాధించాలని సూచించానని తెలిపాడు. కానీ సింగిల్స్‌ తీయకుంటే బాగుండదని... వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని కోహ్లీ తనతో చెప్పాడని రాహుల్‌ వెల్లడించాడు. ఆ తర్వాత రాహుల్‌ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ సాధించే అవకాశమిచ్చాడు. సింగిల్స్‌ కోసం కోహ్లి ప్రయత్నించినా రాహుల్‌ వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 97తో ఉన్నాడు. మూడో బంతికి సిక్సర్‌తో కోహ్లి శతకం అందుకున్నాడు.
ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 256 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. తొలుత రోహిత్‌, గిల్‌.. విజయానికి గట్టి పునాదీ వేయగా... కోహ్లీ పనిని పూర్తి చేశాడు. అ‌ద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. సిక్స్‌తో ఇటు భారత జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు కోహ్లీ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో విరాట్‌ 103 పరుగులు చేశాడు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget