అన్వేషించండి

IND vs NZ : న్యూజిలాండ్‌, భారత్‌ మ్యాచ్‌లో క్రీజులోకి రాకపోయినా రనౌట్‌ ఎందుకివ్వలేదు?

ODI World Cup 2023: ముంబైలోని వాంఖడే వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీఫైనల్లో ఆసక్తికర ఘటన జరిగింది. కివీస్‌ ఇన్నింగ్స్ 43 ఓవర్లో జరిగిన ఓ ఘటన క్రికెట్ అభిమానులను గందరగోళంలో పడేసింది.

India vs New zealand semi final: ముంబైలోని వాంఖడే(Wankhede)  వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌(india vs new zealand )మధ్య జరిగిన సెమీఫైనల్లో ఆసక్తికర ఘటన జరిగింది. కివీస్‌ ఇన్నింగ్స్ 43 ఓవర్లో జరిగిన ఓ ఘటన క్రికెట్ అభిమానులను గందరగోళంలో పడేసింది. కివీస్‌ ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో బుమ్రా వికెట్లను గిరాటేసినా అంపైర్ ఔట్ ఇవ్వకపోవటం ఆశ్చర్యపరిచింది. జస్ప్రీత్ బుమ్రా విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. అప్పటికీ ఫిలిప్స్ ఇంకా క్రీజులోకి చేరుకోలేదు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో అంపైర్‌ అవుట్ ఎందుకు ఇవ్వలేదా అని చాలా మంది అభిమానులు గందరగోళంలో పడ్డారు.  దీని వెనుక అసలు కారణం వేరే ఉంది.

 బుమ్రా వేసిన 43వ ఓవర్ తొలి బంతికి మిచెల్ రెండు పరుగులు తీశాడు. అయితే బంతిని ఆపిన రవీంద్ర జడేజానాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు ఉన్న వికెట్లకు డైరెక్ట్‌గా షూట్‌ చేశాడు. వికెట్లను తాకిన బంతి పక్కకు దూసుకెళ్లింది. అప్పటికే తొలి పరుగు పూర్తిచేసిన మిచెల్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న బుమ్రా బౌలర్ వైపున ఉన్న వికెట్లకు నేరుగా త్రో చేశాడు. . అప్పటికి కివీస్ బ్యాటర్ ఫిలిప్స్ క్రీజులోకి చేరుకోలేదు. కానీ అంపైర్ అతన్ని నాటౌట్‌గా ప్రకటించారు.

మెన్‌ క్రికెట్‌ కమిటీ(MCC) రూల్స్ ప్రకారం వికెట్ల మీద ఉన్న రెండు బెయిల్స్ కిందపడిన సమయంలో ఫీల్డర్ రనౌట్ చేయాలని అనుకుంటే బంతిని చేత్తో పట్టుకుని వికెట్లను లాగేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్, ఇండియా మ్యాచ్‌లో బుమ్రా రనౌట్ చేసినప్పటికే వికెట్ మీద ఉన్న బెయిల్స్ లేకపోవడంతో దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. జడేజా విసిరినప్పుడే బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో బుమ్రా మరోసారి వికెట్లను పడగొట్టినా ఫలితం లేకపోయింది. అందుకే అంపైర్ గ్లెన్ ఫిలిప్స్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. ఒకవేళ బుమ్రా బంతిని చేత్తో పట్టుకుని వికెట్‌ను లాగేసి ఉంటే ఫిలిప్స్‌ను రనౌట్ అయ్యేవాడు. 

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌  రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. కళ్లముందు భారీ లక్ష్యం కనపడుతున్నా న్యూజిలాండ్ గొప్పగా పోరాడింది. అయినా భారత బౌలర్ల ముందు ఆ పోరాటం సరిపోలేదు. విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌ భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కానీ షమీ మరోసారి జూలు విదిల్చడంతో కివీస్‌ 48.5 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించాడు.

 కోహ్లీ, అయ్యర్‌ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ అద్భుత బౌండరీలతో ఆకట్టుకోగా.. అయ్యర్‌ భారీ షాట్లతో అలరించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ వన్డేల్లో చేసిన అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే  శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో అయ్యర్‌ శతకం బాదేశాడు. అనంతరం స్కోరును పెంచే క్రమంలో 70 బంతుల్లో 105 పరుగులు చేసి అయ్యర్‌ వెనుదిరిగాడు. చివర్లో రాహుల్‌ కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget